Telangana IAS transfers : తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా విభాగంలో కీలక మార్పులు చేపట్టింది. మొత్తం 10 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఈ బదిలీలు చోటుచేసుకోవడం విశేషం.
ఈ మార్పుల్లో ముఖ్యమైనది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)కు కొత్త చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నియామకం. ఇప్పటివరకు ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్న జ్యోతి బుద్ధ ప్రకాష్ను SCCL CMDగా నియమించారు. ఇంతకాలం ఇన్చార్జ్గా వ్యవహరించిన కృష్ణ భాస్కర్ను ఆ బాధ్యతల నుంచి తప్పించారు.
Read Also: Shivraj Singh: తెలుగు రాష్ట్రాల రైతులపై అప్పుల భారం ఎక్కువ
సీనియర్ ఐఏఎస్ అధికారులకు అదనపు శాఖల (Telangana IAS transfers) బాధ్యతలు కూడా అప్పగించారు. సబ్యసాచి ఘోష్కు గిరిజన సంక్షేమ శాఖతో పాటు ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదా కల్పించారు. సందీప్ కుమార్ సుల్తానియాను ప్రణాళిక శాఖతో పాటు తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ (TGRAC) డైరెక్టర్ జనరల్గా నియమించారు.
దివ్య దేవరాజన్కు పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘ప్రజావాణి’కి కాత్యాయని దేవిని నోడల్ అధికారిగా నియమించారు. పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా రఘురామ్ శర్మ, జలమండలి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా మయాంక్ మిట్టల్ బాధ్యతలు చేపట్టనున్నారు.
పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా, వేగవంతంగా మార్చాలనే ఉద్దేశంతో ఈ బదిలీలు చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: