हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Air India Ahmedabad-London Flight : మరో ఫ్లైట్లో సాంకేతిక సమస్య

Sudheer
Air India Ahmedabad-London Flight : మరో ఫ్లైట్లో సాంకేతిక సమస్య

ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు మరోసారి వార్తల్లో నిలుస్తున్నాయి. అహ్మదాబాద్ నుంచి లండన్ (Ahmedabad-London Flight) వెళ్ళాల్సిన ఎయిర్ ఇండియా (Air India) AI159 విమానంలో తాజాగా సాంకేతిక లోపం తలెత్తింది. విమానం టేకాఫ్‌కి సిద్ధంగా ఉన్న సమయంలోనే ఈ లోపం గుర్తించడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెంటనే సర్వీసును రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అహ్మదాబాద్-లండన్ మార్గంలో ఎయిర్ ఇండియా ప్రమాదం

ఇందులో గమనించదగిన విషయం ఏంటంటే.. జూన్ 12న అహ్మదాబాద్-లండన్ మార్గంలోనే ఎయిర్ ఇండియా మరో విమానం కుప్పకూలి భారీ ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో కెప్టెన్ సుమీత్ సబర్వాల్ సహా 270 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో అదే రూట్‌లో తొలిసారి బయలుదేరుతున్న AI159 ఫ్లైట్‌కి ఇలాంటి సాంకేతిక లోపం తలెత్తడం ప్రయాణికుల్లో ఆందోళన రేకెత్తించింది. ఇప్పటికే ఎయిర్ ఇండియా సంస్థపై ప్రజల్లో విశ్వాసం తగ్గుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసులకు వరుసగా అంతరాయాలు

తాజా ఘటనతోపాటు, ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసులకు వరుసగా అంతరాయాలు ఎదురవుతున్నాయి. టెక్నికల్ లోపాలు, ఎమర్జెన్సీ ల్యాండింగులు, సిబ్బంది సమస్యలు ఇలా అన్ని మిలిపి విమానయాన రంగంలో నిర్లక్ష్యం చర్చనీయాంశమవుతోంది. వాయుసేవలు వినియోగించే ప్రయాణికులు భద్రతపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎయిర్ ఇండియా తాజా ఘటనపై పూర్తి వివరాలు, దీనిపై సంస్థ స్పందన కోసం ఇంకా వేచి చూడాల్సి ఉంది.

Read Also : Thug Life: కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమా విడుదలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870