हिन्दी | Epaper

Air India Ahmedabad-London Flight : మరో ఫ్లైట్లో సాంకేతిక సమస్య

Sudheer
Air India Ahmedabad-London Flight : మరో ఫ్లైట్లో సాంకేతిక సమస్య

ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు మరోసారి వార్తల్లో నిలుస్తున్నాయి. అహ్మదాబాద్ నుంచి లండన్ (Ahmedabad-London Flight) వెళ్ళాల్సిన ఎయిర్ ఇండియా (Air India) AI159 విమానంలో తాజాగా సాంకేతిక లోపం తలెత్తింది. విమానం టేకాఫ్‌కి సిద్ధంగా ఉన్న సమయంలోనే ఈ లోపం గుర్తించడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెంటనే సర్వీసును రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అహ్మదాబాద్-లండన్ మార్గంలో ఎయిర్ ఇండియా ప్రమాదం

ఇందులో గమనించదగిన విషయం ఏంటంటే.. జూన్ 12న అహ్మదాబాద్-లండన్ మార్గంలోనే ఎయిర్ ఇండియా మరో విమానం కుప్పకూలి భారీ ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో కెప్టెన్ సుమీత్ సబర్వాల్ సహా 270 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో అదే రూట్‌లో తొలిసారి బయలుదేరుతున్న AI159 ఫ్లైట్‌కి ఇలాంటి సాంకేతిక లోపం తలెత్తడం ప్రయాణికుల్లో ఆందోళన రేకెత్తించింది. ఇప్పటికే ఎయిర్ ఇండియా సంస్థపై ప్రజల్లో విశ్వాసం తగ్గుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసులకు వరుసగా అంతరాయాలు

తాజా ఘటనతోపాటు, ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసులకు వరుసగా అంతరాయాలు ఎదురవుతున్నాయి. టెక్నికల్ లోపాలు, ఎమర్జెన్సీ ల్యాండింగులు, సిబ్బంది సమస్యలు ఇలా అన్ని మిలిపి విమానయాన రంగంలో నిర్లక్ష్యం చర్చనీయాంశమవుతోంది. వాయుసేవలు వినియోగించే ప్రయాణికులు భద్రతపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎయిర్ ఇండియా తాజా ఘటనపై పూర్తి వివరాలు, దీనిపై సంస్థ స్పందన కోసం ఇంకా వేచి చూడాల్సి ఉంది.

Read Also : Thug Life: కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమా విడుదలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870