పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, అమెరికా మరియు ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చి యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణానంతరం ఆ దేశం ప్రతీకారంతో రగిలిపోతూ, హెజ్బొల్లా వంటి మిలిటెంట్ సంస్థల మద్దతుతో టెల్-అవీవ్పై క్షిపణులు, రాకెట్లతో విరుచుకుపడుతోంది. ఈ దాడుల ధాటికి బైట్ షీమేష్లో బాంబు షెల్టర్ కూలి తొమ్మిది మంది మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 12కు చేరింది. జెరూసలెం వీధుల్లో సైరన్ల మోత మార్మోగుతుండటంతో ఇజ్రాయెల్ యంత్రాంగం హైఅలర్ట్ ప్రకటించింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఇజ్రాయెల్లోని తమ పౌరుల భద్రతపై అమెరికా రాయబార కార్యాలయం చేసిన ప్రకటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తమ సిబ్బందిని తరలించడం ప్రస్తుతానికి సాధ్యం కాదని, పౌరులకు తక్షణ సహాయం చేసే స్థితిలో తాము లేమని ఎంబసీ స్పష్టం చేయడం అక్కడి అమెరికన్లను దిక్కుతోచని స్థితిలోకి నెట్టింది.
CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ!
మరోవైపు, సరిహద్దులు దాటి వెళ్లాలనుకునే వారి కోసం ఈజిప్టుకు వెళ్లే టాబా క్రాసింగ్ వద్ద రవాణా సౌకర్యాలు కల్పించినప్పటికీ, ఆ మార్గంలో ప్రయాణం సురక్షితమని హామీ ఇవ్వలేమని అమెరికా పేర్కొనడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దాడులకు ముందు రోజు విమానాల ద్వారా వెళ్ళమని సూచించినా, 24 గంటలు గడవక ముందే యుద్ధం ముదరడంతో విమాన సర్వీసులు కూడా అస్తవ్యస్తమయ్యాయి. వెస్ట్ బ్యాంక్, గాజా సమీపంలోని తమ పౌరులు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విదేశాంగ శాఖ హెచ్చరించింది. ఇరాన్ లక్ష్యంగా చేసుకోకుండా గల్ఫ్ దేశాల్లోని రాయబార కార్యాలయాలను సైతం అమెరికా మూసివేసింది. అమెరికా రాయబారి మైక్ హకబీ మాట్లాడుతూ, ప్రజలు తీవ్ర భయాందోళనల్లో ఉన్నారని, తమ వారిని స్వదేశానికి చేర్చాలంటూ వేల సంఖ్యలో విజ్ఞప్తులు వస్తున్నాయని తెలిపారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :