हिन्दी | Epaper

Ration Distribution : వారం రోజుల్లోనే కోటి మందికి రేష‌న్ పంపిణీ – మంత్రి నాదెండ్ల

Sudheer
Ration Distribution : వారం రోజుల్లోనే కోటి మందికి రేష‌న్ పంపిణీ – మంత్రి నాదెండ్ల

ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పౌర సరఫరా వ్యవస్థ(Civil Supply System)ను మరింత సమర్థవంతంగా మార్చే దిశగా ముందడుగు వేసింది. గతంలో వాహనాల ద్వారా రేషన్ సరుకులను ఇంటికి పంపిణీ చేసే విధానాన్ని రద్దు చేసి, జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా చౌక ధరల దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ (Ration Distribution) చేసే విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే కోటి మందికి పైగా లబ్ధిదారులకు రేషన్ సరుకులు అందించడాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ఒక గొప్ప విజయంగా పేర్కొన్నారు.

ఏడు రోజుల్లో 1,05,27,767 మంది లబ్ధిదారులకు రేషన్ సరుకులు

రాష్ట్రవ్యాప్తంగా 29,796 రేషన్ దుకాణాల ద్వారా 1,46,21,232 మంది కార్డుదారులకు సరుకులు పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఏడు రోజుల్లో 1,05,27,767 మంది లబ్ధిదారులకు రేషన్ సరుకులు అందించామని మంత్రి తెలిపారు. అలాగే 98,77,670 మందికి పంచదారను పంపిణీ చేశామని పేర్కొన్నారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఇంటి వద్దకే సరుకులు అందించే సేవను ప్రారంభించామని, ఇప్పటికే 11 లక్షలకు పైగా లబ్ధిదారులు ఈ సేవను పొందారని వెల్లడించారు.

ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణి

ప్రభుత్వం “ఇంటింటికీ సేవ” అనే లక్ష్యంతో పని చేస్తోందని, ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు లబ్ధిదారులు తమకు అనుకూల సమయాల్లో సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించామని మంత్రి తెలిపారు. పాత విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టి, వినియోగదారుల సౌకర్యం కోసం మరింత పారదర్శకత, సమర్థతతో వ్యవస్థను పునర్నిర్మించామని చెప్పారు. డీలర్లు సేవా దృక్పథంతో పని చేయాలని స్పష్టం చేస్తూ, ప్రభుత్వం ప్రజల అవసరాల పట్ల బాధ్యతగా ఉండి పనిచేస్తోందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

Read Also : Mukesh Ambani : ముంబై ఐసీటీకి ముకేశ్‌ అంబానీ గురుదక్షిణగా రూ.151 కోట్ల విరాళం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870