ఏపీ రాష్ట్రంలో మెగా డీఎస్సీ–2025 పరీక్షలు నిన్న (తొలి రోజు) ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షలు మొత్తం రెండు సెషన్లలో నిర్వహించగా, మొత్తం 142 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు శాంతియుత వాతావరణంలో పరీక్షలు రాశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడం పట్ల విద్యాశాఖ సంతృప్తి వ్యక్తం చేసింది.
14,281 మంది అభ్యర్థులు
ఉదయం సెషన్లో నిర్వహించిన పరీక్షలకు 16,102 మందిని ఆహ్వానించగా, 14,281 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అదే విధంగా మధ్యాహ్నం సెషన్లో 8,790 మందికి అడ్మిట్ కార్డులు జారీ కాగా, 7,611 మంది హాజరై పరీక్ష రాశారు. ఉదయం, మధ్యాహ్నం కలిపి మొత్తం హాజరు శాతం 87.94%గా నమోదైంది. ఇది గత సంవత్సరాలతో పోల్చితే తక్కువ కాదని అధికారులు పేర్కొన్నారు.
సెంటర్ల వద్ద పకడ్బందీ భద్రతా చర్యలు
ఈ పరీక్షలు జూన్ 30వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అభ్యర్థుల కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, సెంటర్ల వద్ద పకడ్బందీ భద్రతా చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. నిబంధనల ప్రకారం ప్రశ్నపత్రాల రహస్యతను కాపాడుతూ పరీక్షల నిర్వహణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లోనూ ఇదే విధంగా పరీక్షలు నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని పేర్కొన్నారు.
Read Also : Pakistan : నిర్ణయాన్ని మార్చుకోవాలని భారత్కు ,పాకిస్థాన్ నాలుగు లేఖలు