భారత్ భద్రతా దళాలు నిర్వహించిన వ్యూహాత్మక దాడులు పాకిస్థాన్ను తలకిందులా మార్చేశాయి. ఉగ్రదాడులకు ప్రతీకారంగా భారత వైమానిక దళాలు లాహోర్, కరాచీ వంటి ప్రదేశాలపై జరిపిన డ్రోన్ దాడులతో పాకిస్థాన్లో హడావుడి మొదలైంది. ఇస్లామాబాద్లోనూ పేలుళ్లు చోటుచేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య, పాక్ ప్రధాని షబాజ్ షరీఫ్ దేశం విడిచిపెట్టి ప్రత్యేక విమానంలో బయటకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారని సమాచారం. ఇప్పటికే ఆయనకు సిబ్బంది సహాయం చేస్తున్నట్టు పాక్ మీడియా నివేదించింది.
పాక్ మీడియా ఫేక్ ప్రచారం
ఇంతటి దారుణ పరాజయాన్ని జీర్ణించుకోలేక, పాకిస్థాన్ తాజాగా మీడియా ముందు అరబోయడం మొదలుపెట్టింది. పఠాన్కోట్, జైసల్మేర్, శ్రీనగర్లపై తాము దాడులు చేశామని చెబుతూ, భారతీయ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించింది. భారతదేశం రాజకీయ ప్రయోజనాల కోసం తమపై నిరాధార ఆరోపణలు చేస్తోందని, అవి పూర్తిగా తప్పుడు ప్రచారమని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాదు, ఈ ఆరోపణలు ప్రాంతీయ స్థిరతకు ముప్పుగా మారుతాయని మండిపడ్డారు.
శాంతి అంటూ పాక్ కొత్త నాటకం
అంతర్జాతీయ సమాజం భారతదేశం చర్యలను గమనించి, అదుపు చేయాలని పాక్ కోరుతోంది. తప్పుడు సమాచారాన్ని ఉపయోగించి దురాక్రమణకు సాకులు తయారు చేస్తున్నారని, అటువంటి ప్రవర్తన శాంతికి భంగం కలిగిస్తుందని పేర్కొంది. అయినా సరే, పాక్ శాంతికి కట్టుబడి ఉంటుందని, కానీ తన భద్రతా హక్కులను తలకిందులు చేసే ప్రయత్నాల్ని తిప్పికొడతామని హెచ్చరించింది. వాస్తవానికి, భారత దాడులు పాక్ ఉగ్రవాద స్థావరాలపై జరిగాయి అనేది స్పష్టమైనా, పాక్ మాత్రం తప్పుడు కథనాలతో అంతర్జాతీయ దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోంది.
Read Also : Pakistani Pilot : పాకిస్థాన్ పైలట్ను అదుపులోకి తీసుకున్న భారత ఆర్మీ