Income tax new rules : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. రానున్న ఏప్రిల్ 1 నుంచి దేశంలో నూతన ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి వస్తుందని వెల్లడించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను Lok Sabha లో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె ఈ విషయాన్ని తెలిపారు. సామాన్యులకు పన్ను రిటర్నులు సులభంగా దాఖలు చేసేలా చట్టంలో పలు మార్పులు చేసినట్లు చెప్పారు. ఆదాయపు పన్ను ఫారాలను మరింత సరళతరం చేసి త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు.
సవరించిన పన్ను రిటర్నుల గడువును కూడా ప్రభుత్వం పొడిగించింది. డిసెంబర్ 31తో ముగిసే గడువును ఇకపై మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. విదేశీ ప్రయాణాలు, విదేశీ విద్య, వైద్య ఖర్చులపై విధించే టీడీఎస్ను 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు. అలాగే మానవ వనరుల సరఫరా సంస్థలపై టీడీఎస్ రేట్లను కూడా తగ్గించి 1–2 శాతం మధ్య పరిమితం చేస్తున్నట్లు చెప్పారు. రహదారి ప్రమాద పరిహారం వడ్డీపై పన్నును పూర్తిగా తొలగిస్తున్నట్లు వెల్లడించారు.
Read Also:ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్

ఇకపై విదేశీ ఆస్తుల వివరాలను వెల్లడించడం తప్పనిసరి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. కార్పొరేట్ బైబ్యాక్లపై 2 శాతం పన్ను, నాన్-కార్పొరేట్ బైబ్యాక్లపై 30 శాతం పన్ను విధిస్తున్నట్లు తెలిపారు. పన్ను వివాదాల్లో క్రిమినల్ చర్యలను తగ్గిస్తూ, జైలు శిక్షను రెండేళ్లకు పరిమితం చేస్తున్నట్లు చెప్పారు. జరిమానా చెల్లిస్తే జైలు శిక్ష నుంచి కూడా మినహాయింపు లభించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ మార్పులతో పన్ను వ్యవస్థ మరింత పారదర్శకంగా, ప్రజలకు అనుకూలంగా మారుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: