మేఘాలయ రాష్ట్రం ఈస్ట్ జైంతియా హిల్స్ జిల్లాలోని థాంగ్స్కూ ప్రాంతంలో గల ఒక బొగ్గు గనిలో గురువారం సంభవించిన భారీ పేలుడు 16 మంది కార్మికుల ప్రాణాలను బలితీసుకుంది. ఈ హృదయవిదారక ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు అండగా నిలిచేందుకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుండి మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
Narendra Modi speech : సిక్కులపై ద్వేషమా? కాంగ్రెస్పై మోదీ ఘాటు విమర్శలు!
పోలీసు అధికారుల ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ప్రమాదం జరిగిన గని అక్రమంగా నిర్వహిస్తున్నదిగా అనుమానిస్తున్నారు. పేలుడు సంభవించిన సమయంలో గని లోపల చాలా మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా ఎస్పీ వికాశ్ కుమార్ నేతృత్వంలో సహాయక బృందాలు ఇప్పటివరకు 16 మృతదేహాలను వెలికితీశాయి. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అక్రమ గనుల నిర్వహణే ఇలాంటి ప్రాణాంతక ప్రమాదాలకు కారణమవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ దారుణ ఘటనపై మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా స్పందిస్తూ, ప్రభుత్వం తరపున సమగ్ర విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించి, బాధ్యులైన వారిని గుర్తించి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. గనుల్లో భద్రతా ప్రమాణాల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. విచారణ నివేదిక అందిన వెంటనే తదుపరి చర్యలు చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com