ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పాన్ని రాష్ట్రానికే ఒక నమూనాగా మార్చేందుకు కంకణం కట్టుకున్నారు. కుప్పం పర్యటనలో భాగంగా స్థానిక ఆగస్త్య అకాడమీలో విద్యార్థులతో ముచ్చటించిన ఆయన, కుప్పాన్ని కేవలం ఒక నియోజకవర్గంగా కాకుండా సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ఒక “ప్రయోగశాల”గా (Laboratory) తీర్చిదిద్దుతున్నట్లు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక టెక్నాలజీలను ఇక్కడికి తీసుకువచ్చి, గ్రామీణ స్థాయిలో కూడా డిజిటల్ విప్లవం ఎలా ఉంటుందో ప్రపంచానికి చాటిచెప్పడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
Telangana: కేసీఆర్ తో KTR భేటీ
భవిష్యత్తు భారతదేశ గమనాన్ని నిర్దేశించేది నేటి విద్యార్థులేనని, అందుకే అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలపై యువత సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. “భవిష్యత్తులో భారతదేశం ఎలా ఉండబోతోందో విద్యార్థులు ఇప్పుడే ఊహించుకోవాలి, అప్పుడే మారుతున్న కాలానికి అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకోగలరు” అని ఆయన దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా, గ్లోబల్ ట్రెండ్స్ను గమనిస్తూ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కోరారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి రంగాల ప్రాధాన్యతను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

రాష్ట్ర పురోభివృద్ధిలో కీలకమైన విద్యుత్ రంగం గురించి కూడా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ రంగంలో వినూత్న మార్పులు తీసుకొస్తున్నామని, సాంకేతికతను జోడించడం ద్వారా నిర్వహణ ఖర్చులను తగ్గించి వినియోగదారులపై భారం పడకుండా చూస్తున్నామని తెలిపారు. గతంలో కంటే విద్యుత్ కొనుగోలు ఛార్జీలను తగ్గించామని, నాణ్యమైన విద్యుత్తును తక్కువ ధరకే అందించడం ద్వారా సామాన్యుడికి మేలు చేయడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని వెల్లడించారు. కుప్పం వంటి మారుమూల ప్రాంతాల నుంచి కూడా భవిష్యత్తు నాయకులు ఉద్భవించాలని ఆకాంక్షిస్తూ విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com