Kukatpally police arrest : పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన కాపర్ కేబుల్స్ దొంగతనం కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 500 కిలోల కాపర్ ఆర్మర్డ్ కేబుల్స్ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.6 లక్షలుగా పోలీసులు అంచనా వేశారు.
అరెస్ట్ అయిన వారిలో లక్షీంద్ర బొరువా (26), అనుపమ్ గోగోయ్ (26), నీతూ దాస్ (25), నబజ్యోతి దాస్ ఉన్నారు. వీరంతా అస్సాం రాష్ట్రానికి చెందినవారిగా, నగరంలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి 4న కుకట్పల్లి ఐడీఎల్ లేక్ సమీపంలోని మకుట తరంగ ప్రాజెక్ట్లో పనిచేస్తున్న సైట్ ఇంజినీర్ ఉల్లి కునాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. గత రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఏడు బండిళ్ల కాపర్ కేబుల్స్ను దొంగిలించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురు నిందితులను పట్టుకుని వారి వద్ద నుంచి 500 కిలోల కాపర్ కేబుల్స్ను స్వాధీనం చేసుకున్నారు. మద్యం సేవనం, ధూమపానం అలవాట్ల కారణంగా వ్యక్తిగత ఖర్చుల కోసం ఈ దొంగతనానికి పాల్పడ్డట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు.
Read Also: Phone: నోట్లో పేలిన ఫోన్ బ్యాటరీ!

ఈ సందర్భంగా కుకట్పల్లి పోలీసులు ప్రజలకు, కాంట్రాక్టర్లకు, సైట్ యజమానులకు హెచ్చరిక జారీ చేశారు. సెక్యూరిటీ సిబ్బందిని నియమించే ముందు తప్పనిసరిగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయాలని, వారి గుర్తింపు పత్రాలను పరిశీలించి భద్రపరచాలని సూచించారు.
ఇక మరో కేసులో, మూసాపేటకు చెందిన మొహమ్మద్ సల్మాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో అతడు డిసెంబరులో అంజనేయ నగర్, మూసాపేటలో ఒక ద్విచక్ర వాహనం దొంగతనం చేసినట్లు, అలాగే ఐదు రోజుల క్రితం వినవి హాస్టల్ నుంచి రెండు మొబైల్ ఫోన్లు దొంగిలించినట్లు అంగీకరించాడు. దొంగిలించిన వాహనం, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: