వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy) పేరు మరోసారి హాట్ టాపిక్గా మారింది. గ్రావెల్ అక్రమ రవాణా కేసు (Gravel smuggling case) లో కీలక నిందితుడిగా పేర్కొన్న ఆయనను తాజాగా సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. ఇప్పటికే నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న కాకాణిని వైద్య పరీక్షల అనంతరం కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ ఆయనను సిట్ విచారించనుంది.
రెండు రోజులపాటు విచారణ
ఈ రోజు (జూన్ 25) నుంచి రేపటివరకు రెండు రోజుల పాటు సిట్ అధికారులు కాకాణిని విచారించనున్నారు. గ్రావెల్ అక్రమ రవాణాకు సంబంధించిన ఆధారాలు, కాంట్రాక్టులు, సంబంధిత వ్యక్తుల వివరాలు, అలాగే ఎలాంటి అధికార బద్నాముకు పాల్పడ్డారా అనే కోణాల్లో అధికారుల ప్రశ్నలు సాగనున్నాయి. కేసు విచారణలో కీలక మలుపుగా ఈ కస్టడీ మారే అవకాశం కనిపిస్తోంది.
ఫోర్జరీ ఆరోపణలపై విచారణ
ఈ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి A2 నిందితుడిగా ఉన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులును లక్ష్యంగా చేసుకుని ఫోర్జరీ సంతకాలు చేసి వివిధ డాక్యుమెంట్లను తయారు చేసినట్లు కేసు నమోదు అయింది. ఇప్పటికే ఈ కేసులో పలు మలుపులు తిరుగుతున్న తరుణంలో, కాకాణి కస్టడీ విచారణతో మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అధికార దుర్వినియోగం, రాజకీయ ప్రయోజనాల కోసమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read Also : Chevireddy Mohit Reddy: సిట్ విచారణకు హాజరుకాని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి