Jogi ramesh news : జోగి రమేశ్కు నకిలీ మద్యం కేసులో మరోసారి న్యాయపరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇటీవల షరతులతో మంజూరైన బెయిల్ను రద్దు చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు విజయవాడ ఎక్సైజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జోగి రమేశ్ బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, కీలక సాక్ష్యాధారాలు తారుమారు చేసే ప్రమాదం ఉందని సిట్ తన పిటిషన్లో పేర్కొంది. ఈ అంశంపై త్వరలోనే విచారణ జరగనుంది.
నకిలీ మద్యం తయారీ, విక్రయాలకు సంబంధించిన కేసులో జోగి రమేశ్తో పాటు ఆయన సోదరుడు జోగి రాము అరెస్ట్ అయ్యారు. ఇద్దరూ దాదాపు 83 రోజుల పాటు రిమాండ్లో గడిపిన తరువాత తంబళ్లపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
Read Also: Budget 2026: బడ్జెట్లో బంగ్లాదేశ్కు భారీ కోతతో భారత్ గుణపాఠం

జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం జోగి రమేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేశ్పై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంపై దాడి ఘటన చోటుచేసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై పలువురు తెలుగుదేశం పార్టీ నేతలపై కేసులు నమోదయ్యాయి.
ఈ పరిణామాల మధ్య సిట్ బెయిల్ రద్దు పిటిషన్ వేయడం మరింత ఉత్కంఠను రేకెత్తించింది. కోర్టు తీర్పు ఎలా ఉంటుందన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: