భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ప్రమాదంలో గాయపడిన తర్వాత ఆయన ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని, కోలుకునే దిశగా ఉన్నారని క్రిక్బజ్ సమాచారం వెల్లడించింది. చికిత్స అనంతరం అయ్యర్ను ఐసీయూ నుంచి బయటకు మార్చడం అభిమానులకు ఊరట కలిగించింది. తన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్నదనే సంకేతాలు ఇవ్వడంతో టీమ్మేనేజ్మెంట్ సంతృప్తి వ్యక్తం చేసింది.
Month Toofan : రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే ఛాన్స్
బీసీసీఐ అయ్యర్ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఇందుకు ప్రత్యేకంగా టీమ్ డాక్టర్ను నియమించి, ఆయన దగ్గరుండి పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అన్ని వైద్య సహాయాలను అత్యవసర ప్రాతిపదికన అందిస్తున్నారు. ప్లేయర్స్ సేఫ్టీకి ప్రాధాన్యతనిస్తూ, వైద్య బృందం నిరంతరంగా పరిస్థితిని పరిశీలిస్తోంది. అయ్యర్ తిరిగి ఫామ్ లోకి వచ్చే సమయం గురించి మాత్రం ఇంకా అధికారికంగా ఏ ప్రకటన రాలేదు.

ఈ నెల 25న సిడ్నీలో జరిగిన వన్డే మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ అయ్యర్ అప్రమత్తత కోల్పోయి గాయపడ్డారు. అతడి ఎడమవైపు పక్కటెముకల వద్ద ఉన్న ముఖ్య అవయవం Spleen (ప్లీహం) దెబ్బతినడంతో వైద్యులు వెంటనే జోక్యం చేసుకున్నారు. ప్లీహానికి గాయం తీవ్రత ఉన్నప్పటికీ, సమయానికి చికిత్స అందడంతో ప్రమాదం తప్పింది. క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షలు తెలియజేస్తున్నారు. తిరిగి క్రికెట్ గ్రౌండ్ లో మెరిసే రోజును ఎదురు చూస్తున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/