हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

India – Pakistan War : హై టెన్షన్.. 11 చోట్ల కనిపించిన పాక్ డ్రోన్లు?

Sudheer
India – Pakistan War : హై టెన్షన్.. 11 చోట్ల కనిపించిన పాక్ డ్రోన్లు?

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్న వేళ, పాకిస్తాన్ డ్రోన్లు భారత సరిహద్దు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కనిపించాయి. ప్రముఖ మీడియా సంస్థ ‘ఇండియా టుడే’ కథనం ప్రకారం, మొత్తం 11 ప్రాంతాల్లో డ్రోన్లు గాలిలో విహరించినట్టు తెలుస్తోంది. జమ్మూకశ్మీర్‌ లోని సాంబ, కుప్వారా, ఉరి, నౌగామ్-హంద్వారా సెక్టార్‌తో పాటు పూంఛ్, జమ్మూ, పఠాన్ కోట్, రాజస్థాన్‌లోని పోఖ్రాన్, పంజాబ్‌లోని అమృత్ సర్, రాజౌరీ ప్రాంతాల్లో ఈ డ్రోన్లు కనిపించాయి.

అమృత్ సర్ సమీపంలో 4 పేలుళ్లు

ప్రత్యేకంగా అమృత్ సర్ సమీపంలో 4 పేలుళ్లు సంభవించాయన్న వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవలి కాలంలో ఇదే ప్రాంతాన్ని టార్గెట్ చేస్తూ పాక్ మిసైల్ దాడులకు ప్రయత్నించగా, భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. తాజా ఘటనలతో మళ్లీ అదే ప్రాంతం పాక్ లక్ష్యంగా మారినట్టుగా తెలుస్తోంది. డ్రోన్ల ద్వారా పేలుడు పదార్థాలు, నిఘా పరికరాలను పంపించే ప్రయత్నాలుగా అధికారులు భావిస్తున్నారు.

సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్

ఈ నేపథ్యంలో అన్ని సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. భారత త్రివిధ దళాలు, ఎయిర్ డిఫెన్స్ యంత్రాంగం, నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. డ్రోన్ల కదలికలను గుర్తించి తక్షణమే వాటిని కూల్చివేయాలన్న దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద చట్టవిరుద్ధ చర్యలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచిస్తున్నారు.

Read Also : BCCI : ఐపీఎల్ వాయిదా..టికెట్ల సొమ్మును వాపసు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870