हिन्दी | Epaper

ఆశా వర్కర్లకు గుడ్​న్యూస్​..వయోపరిమితి పెంపు..

sumalatha chinthakayala
ఆశా వర్కర్లకు గుడ్​న్యూస్​..వయోపరిమితి పెంపు..

అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశా వర్కర్లపై వరాల జల్లు కురిపించారు. ఆశా కార్యకర్తల గరిష్ఠ వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచారు. వారికి మొదటి 2 ప్రసవాలకు ఇకపై 180 రోజులు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వనున్నారు. ఆశా కార్యకర్తలందరికీ ప్రయోజనం చేకూర్చేలా గ్రాట్యుటీ చెల్లించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. వీటికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 42,752 మంది ఆశా కార్యకర్తలున్నారు. గ్రామాల్లో 37,017 మంది, పట్టణాల్లో 5,735 మంది ఉన్నారు. ప్రస్తుతం వారు నెలకు రూ.10వేల వేతనం పొందుతున్నారు.

ఆశా వర్కర్లకు గుడ్​న్యూస్​ వయోపరిమితి

గ్రాట్యుటీ కింద రూ.1.5 లక్షలు అందే అవకాశం

సర్వీస్‌ ముగింపులో గ్రాట్యుటీ కింద రూ.1.5 లక్షలు అందే అవకాశం ఉంది. ఇది ఆశా వర్కర్లకు కొంత ఆర్థిక భద్రతను అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 42,752 మంది ఆశా వర్కర్లు ఉన్నారు. వీరిలో 37,017 మంది గ్రామీణ ప్రాంతాల్లో, 5,735 మంది పట్టణ ప్రాంతాల్లో సేవలందిస్తున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వీరంతా లబ్ధి పొందనున్నారు. ఈ నిర్ణయాలు ఆశా వర్కర్ల ఉద్యోగ భద్రతను పెంచడమే కాకుండా, వారి సేవలకు గౌరవాన్ని కలిగించేలా ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజారోగ్య సంరక్షణలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆశా వర్కర్లు, ఈ కొత్త విధానాల ద్వారా మరింత ఉత్సాహంగా పని చేసే అవకాశం ఉంది. త్వరలోనే ప్రభుత్వం ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు విడుదల చేయనుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870