हिन्दी | Epaper

D.CM Pawan: గోదావరి వాటర్ గ్రిడ్ శంకుస్థాపన చేయనున్న పవన్

Saritha
D.CM Pawan: గోదావరి వాటర్ గ్రిడ్  శంకుస్థాపన చేయనున్న పవన్

ఉమ్మడి గోదావరి(Godavari) జిల్లాల ప్రజలకు శుద్ధి చేసిన తాగునీటిని అందించేందుకు కూటమి ప్రభుత్వం కీలకంగా ముందుకు అడుగుపెడుతోంది. (D.CM Pawan) సుమారు రూ.3,050 కోట్లతో చేపట్టబోయే గోదావరి వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. పెరవలి వద్ద జాతీయ రహదారి 216ఏ సమీపంలో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయినాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ఐదు జిల్లాల్లోని సుమారు 67.82 లక్షల మందికి సురక్షితమైన తాగునీటిని అందించనున్నారు. ఈ బృహత్తర పథకంలో ధవళేశ్వరం, బొబ్బర్లంక, వేమగిరి వద్ద గోదావరి జలాలను సేకరించి, ఆధునిక సాంకేతికతతో శుద్ధి చేస్తారు. రెండు దశల్లో ఈ ప్రాజెక్టు అమలు చేయనున్నారు. తొలి దశలో రూ.1,650 కోట్లతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని 11 నియోజకవర్గాల్లో 39.64 లక్షల మందికి, రెండో దశలో రూ.1,400 కోట్లతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో 12 నియోజకవర్గాల్లో 28.18 లక్షల మందికి తాగునీటిని అందిస్తారు. జల్ జీవన్ మిషన్ నిధుల ద్వారా రెండు సంవత్సరాల్లో ప్రాజెక్ట్ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Read also: CM Chandrababu: కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం కీలక వ్యాఖ్యలు

D.CM Pawan: గోదావరి వాటర్ గ్రిడ్  శంకుస్థాపన చేయనున్న పవన్

ప్రజల కోసం శాశ్వత పరిష్కారం

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడుతూ,((D.CM Pawan)) భూగర్భ జలాలు కలుషితం కావడం వల్ల ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నారని, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా దీన్ని పరిష్కరిస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను నిర్మించి, పైప్‌లైన్ల ద్వారా ఇంటింటికి శుద్ధమైన నీటిని సరఫరా చేస్తామని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవతో ప్రాజెక్టు కార్యరూపం దాల్చుతుందని తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమానికి ప్రజలు, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై ఘనస్వాగతం పలకాలని మంత్రి పిలుపునిచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

📢 For Advertisement Booking: 98481 12870