దేశంలో కరోనా (Corona) యాక్టివ్ కేసుల సంఖ్య దడ పుట్టిస్తుంది. గత 24 గంటల్లో 685 కేసులు నమోదవగా, 4 మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుత యాక్టివ్ కేసులలో అత్యధికంగా కేరళలో 1,336 కేసులు, ఆ తర్వాత మహారాష్ట్రలో 467, ఢిల్లీలో 375, గుజరాత్లో 265, కర్ణాటకలో 234, తమిళనాడులో 185, పశ్చిమ బెంగాల్లో 205 కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో నాలుగు మరణాలు నమోదు కాగా… ఇందులో మహారాష్ట్రలో రెండు మరణాలు సంభవించగా, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్లో ఒక్కొక్కటి ఉన్నాయి. దీంతో ఈ ఏడాది కరోనా మరణాల (Coronavirus Deaths ) సంఖ్య 26కి చేరుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు
ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా ఒక కోవిడ్ కేసు నమోదు కాగా… రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 17గా ఉంది. తెలంగాణ గత 24 గంటల్లో ఎలాంటి కోవిడ్ కేసులు నమోదు కానప్పటికీ… ప్రస్తుతం రాష్ట్రంలో మూడు యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే, దేవంలో కోవిడ్ కేసులు స్వల్పంగానే నమోదయ్యాయని… భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం భారత్లో కోవిడ్ కేసుల పెరుగుదల ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. మళ్లీ మాస్క్ లు తప్పేలా లేదని అంత మాట్లాడుకుంటున్నారు.
Read Also : Ration : రేషన్ వద్దనుకునే వారికి నగదు ఇస్తాం – సీఎం చంద్రబాబు