ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెట్టుబడుల ప్రోత్సాహ కార్యక్రమాలు వేగం అందుకుంటున్నాయి. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ రేపటి నుండి ఈనెల 25 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాన ఉద్దేశం – వచ్చే నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ (భాగస్వామ్య సదస్సు)కు ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడం. అక్కడి భారతీయ ప్రవాస వ్యాపారవేత్తలతో పాటు ఆస్ట్రేలియా కంపెనీలతో కూడా లోకేశ్ సమావేశమై, రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై వివరణ ఇవ్వనున్నారు. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, విద్యుత్, గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగాల్లో ఉన్న అవకాశాలను ప్రదర్శించేందుకు ఆయన ప్రత్యేక ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు.
Breaking News -Gold : అంతర్జాతీయ మార్కెట్లో బంగారం భగభగలు
రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు రాబట్టడమే కాకుండా, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యమని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆస్ట్రేలియాలో ఉన్న టెక్ కంపెనీలు, వ్యవసాయ రంగానికి సంబంధించిన పరిశ్రమలు, మైనింగ్, ఎడ్యుకేషన్ సర్వీసులు వంటి విభాగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు లోకేశ్ చర్చలు జరపనున్నారు. ఈ పర్యటనతో రాష్ట్రం అంతర్జాతీయ వ్యాపార వేదికల్లో మరింతగా గుర్తింపు పొందే అవకాశముందని పరిశ్రమల శాఖ అధికారులు భావిస్తున్నారు. విశాఖ సదస్సుకు ముందు ఈ పర్యటన వల్ల విశ్వసనీయత పెరిగి, పెట్టుబడిదారుల్లో ఆసక్తి రేకెత్తుతుందని కూడా అంచనా.

ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నవంబర్ 2 నుంచి 5 వరకు లండన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన కూడా అదే లక్ష్యంతో విశాఖ భాగస్వామ్య సదస్సుకు గ్లోబల్ కంపెనీలను ఆహ్వానించడం, వారిని ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి అవకాశాలపై ఆకర్షించడం. లండన్ పర్యటనలో ఫిన్టెక్, రిన్యూవబుల్ ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలపై ఫోకస్ చేయనున్నారు. గతంలో సీఎం చేసిన విదేశీ పర్యటనల వల్ల రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల వలన వేలాది ఉద్యోగాలు సృష్టించబడ్డాయని అధికారులు గుర్తుచేస్తున్నారు. ఈసారి కూడా “పెట్టుబడులు , ఉపాధి , అభివృద్ధి” అనే మూడు లక్ష్యాలతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ లు రెండు దిశలలో పర్యటనలు నిర్వహించటం ద్వారా ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ బిజినెస్ హబ్గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్నారని తెలుస్తోంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/