IBM quantum computing Amaravati : ఆంధ్రప్రదేశ్కు భారీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో స్విట్జర్లాండ్లోని దావోస్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి N. Chandrababu Naidu ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం IBM చైర్మన్ & సీఈవో Arvind Krishna తో కీలక స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజధాని అమరావతిలో క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్, ముఖ్యంగా క్వాంటం కంప్యూటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు ఐబీఎం సానుకూలంగా స్పందించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఈ భేటీలో సీఎం చంద్రబాబుతో పాటు ఐటీ శాఖ మంత్రి Nara Lokesh కూడా పాల్గొన్నారు. క్వాంటం టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలన్న లక్ష్యంతో ఐబీఎం పూర్తి సహకారం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం ఫలప్రదంగా జరిగిందని, రాష్ట్రంలో ఆధునిక టెక్నాలజీ అభివృద్ధికి ఇది కీలకంగా మారుతుందని అధికారులు పేర్కొన్నారు.
Read Also: Singareni Collieries: మీడియాకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
ఇదే సమావేశంలో యువతకు కృత్రిమ మేధ (AI)లో శిక్షణ (IBM quantum computing Amaravati) కల్పించే అంశంపై కూడా విస్తృతంగా చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా 50 లక్షల మంది యువతకు ఏఐలో నైపుణ్య శిక్షణ అందించేందుకు ఐబీఎం సిద్ధంగా ఉందని అరవింద్ కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన కనీసం 10 లక్షల మంది యువతకు అవకాశం కల్పించాలని మంత్రి నారా లోకేశ్ కోరారు.

ప్రపంచ ఆర్థిక వేదిక World Economic Forum (WEF) వార్షిక సదస్సులో భాగంగా చంద్రబాబు–లోకేశ్ బృందం టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, ఇన్నోవేషన్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు వరుసగా అంతర్జాతీయ సంస్థలతో సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఐబీఎంతో జరిగిన ఈ భేటీ ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: