దేశవ్యాప్తంగా రానున్న ఉపఎన్నికలకు (Bypoll) సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు వేగవంతం చేసింది. బిహార్, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో జరగనున్న ఈ ఎన్నికల పర్యవేక్షణ కోసం మొత్తం 470 మంది అధికారులను సెంట్రల్ అబ్జర్వర్లుగా నియమించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. వీరు ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా సాగేందుకు పర్యవేక్షణ చేస్తారు. పోలింగ్ బూత్ల నిర్వహణ నుంచి ఓట్ల లెక్కింపు వరకు అన్ని దశల్లో పర్యవేక్షకులు కీలక పాత్ర పోషించనున్నారు.

తెలంగాణలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నిక (Jubilee Hills Bypoll) ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి చెందడంతో బైఎలక్షన్ తప్పనిసరైంది. ఈ స్థానంలో ప్రధాన పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉండనుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య గట్టి సమరం నెలకొనే అవకాశం ఉంది.
Fondness : ప్రాణాలు తీస్తున్న అభిమానం!
ఇప్పటికే ఈ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థుల ఎంపికపై పార్టీలలో చర్చలు జోరుగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి గోపినాథ్ సతీమణి సునీతను అభ్యర్థిగా నిలబెట్టనున్నట్లు సమాచారం. ఇతర పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను త్వరలో ప్రకటించనున్నారు. ఉపఎన్నికల సందర్భంగా పర్యవేక్షకుల నియామకంతో ఓటర్లకు సజావుగా, స్వేచ్ఛాయుతంగా పోలింగ్ జరిగేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోందని అధికారులు తెలిపారు.