हिन्दी | Epaper

నేడు కేంద్ర కేబినేట్‌ సమావేశం..

sumalatha chinthakayala
నేడు కేంద్ర కేబినేట్‌ సమావేశం..

న్యూఢిల్లీ: ఈ రోజు ఉదయం 10 గంటలకు కేంద్ర క్యాబినెట్ సమావేశం జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే కేంద్ర క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఇక ఈ కేంద్ర కేబినెట్ సమావేశంలో, బడ్జెట్ సమావేశాలపై చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే.. కుంభమేళాలో జరిగిన సంఘటనపై కూడా చర్చించే ఛాన్స్‌ ఉంది. కుంభమేళా తొక్కిసలాటలో హృదయ విదారక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

image

మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాల కోసం పెద్దఎత్తున తరలివచ్చారు భక్తులు. భక్తుల తాకిడికి బారికేడ్లు విరిగి తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సుమారు 15 మంది మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం అందుతోంది. కుంభమేళాలో తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో..పవిత్ర ‘అమృత్ స్నాన్’ రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఉత్తర ప్రదేశ్‌ సర్కార్‌. ఈ సంఘటనపై కేంద్ర కేబినేట్‌ లో చర్చించే ఛాన్స్‌ ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870