हिन्दी | Epaper

రేపు ఏపీ కేబినెట్ భేటీ

sumalatha chinthakayala
రేపు ఏపీ కేబినెట్ భేటీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం రేపు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రేపు ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశముంది. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా హామీల అమలుపై చర్చించే అవకాశం ఉందని తెలిసింది.

image
image

దీంతో పాటుగా పలు కంపెనీలకు భూములు కేటాయింపుకు ఆమోద ముద్ర వేసే ఛాన్స్ ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రతి నెల రెండుసార్లు మంత్రివర్గ సమావేశం నిర్ణయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించడంతో నెలలో రెండుసార్లు మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. రేపు జరిగే సమావేశంలో కిన్ని సూపర్ సిక్స్ హామీలపై క్లారిటీ వచ్చేఅవకాశముంది. అయితే ఈసారైనా ఉచిత బస్సు ప్రారంభం అవుతుందా లేదా అనేది చూడాలి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆర్టీసీ బస్సు పై నాన్చుడి ధోరణితో ముందుకు వెళుతుంది కూటమి సర్కార్.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870