हिन्दी | Epaper

ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 10 మంది భ‌క్తులు మృతి

sumalatha chinthakayala
ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 10 మంది భ‌క్తులు మృతి

ల‌క్నో: ఈరోజు ఉద‌యం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్‌-మీర్జాపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఆ ప్ర‌మాదంలో 10 మంది దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రో 19 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రుగుతున్న మ‌హాకుంభ్‌లో పుణ్య‌సాన్నాలు చేసేందుకు వెళ్తున్న భ‌క్తులు ఆ ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌యాగ్‌రాజ్‌-మీర్జాపూర్ హైవేపై ఉన్న మీజా ఏరియా వ‌ద్ద బొలెరో వాహ‌నం బ‌స్సును ఢీకొన్న‌ది.

ఘోర రోడ్డు ప్ర‌మాదం భ‌క్తులు

చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని కోర్బా జిల్లా నుంచి భ‌క్తులు సంగం స్నానాల కోసం ప్ర‌యాగ్‌రాజ్ వెళ్తున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని రాజ్‌ఘ‌ర్ జిల్లా నుంచి వ‌స్తున్న బ‌స్సును.. బొలెరో వాహ‌నం ఢీకొట్టింది. ప్ర‌మాదం ప‌ట్ల యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ ఆరా తీశారు. త‌క్ష‌ణ‌మే స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆయ‌న ఆదేశించారు. గాయ‌ప‌డ్డ వారికి చికిత్స అందిస్తున్నారు.

ఈ వారం ఆరంభంలోనే హైద‌రాబాద్ నుంచి వెళ్లిన ఏడుగురు భ‌క్తులు కూడా రోడ్డు ప్ర‌మాదంలో మృతిచెందిన విష‌యం తెలిసిందే. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని జ‌బ‌ల్‌పుర్ జిల్లాలో ఓ ట్ర‌క్కును బ‌స్సు ఢీకొన్న ఘ‌ట‌న‌లో హైద‌రాబాదీ భ‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. కుంభ‌మేళాలో జ‌న‌వ‌రి 29వ తేదీన జ‌రిగిన తొక్కిస‌లాట‌లో 30 మంది మృతిచెంద‌గా, 25 మందిని గుర్తించిన‌ట్లు పోలీసు అధికారి వైభ‌వ్ కృష్ణ తెలిపారు. ఆ తొక్కిస‌లాట‌లో 60 మంది గాయ‌ప‌డ్డారు. జ‌న‌వ‌రి 13వ తేదీన మొద‌లైన మ‌హాకుంభ్‌.. ఫిబ్ర‌వ‌రి 26వ తేదీన ముగియ‌నున్న‌ది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870