हिन्दी | Epaper

పురోహితులకు నెలకు రూ.18వేలు : కేజ్రీవాల్

sumalatha chinthakayala
పురోహితులకు నెలకు రూ.18వేలు : కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని రోజుల్లో నిర్వహించబోతున్నారు. ఈక్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత పెద్ద ఎత్తున వరాల జల్లు కురిపిస్తున్నారు. ఇటీవలే మహిళలు, వృద్ధులకు ప్రత్యేక సంక్షేమ పథకాలు ప్రకటించిన కేజ్రీవాల్‌ తాజాగా ఆలయ అర్చకుల కోసం మరో పథకాన్ని తీసుకు వస్తున్నట్లు వివరించారు. ఆలయాలతో పాటు గురుద్వారాల్లో పని చేసే పూజారులు, గ్రంథీలకు నెల నెలా జీతభత్యాలు ఇస్తామని తెలిపారు. ముఖ్యంగా తాము అధికారంలోకి వస్తే నెలకు 18 వేల చొప్పున గౌరవ వేతనం ఇవ్వబోతున్నట్లు చెప్పుకొచ్చారు.

image
image

ఈ క్రమంలోనే ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తాను ఈరోజు ఒక కొత్త పథకానికి సంబంధించి ముఖ్యమైన ప్రకటన చేస్తున్నట్లు వివరించారు. ఆ పథకం పేరు పూజారి గ్రంథి సమ్మాన్ యోజన అని తెలిపారు. అలాగే ఈ పథకం కింద ఆలయాల పూజారులకు గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించినట్లు వివరించారు. ముఖ్యంగా పురోహితులతో పాటు గ్రంథీలకు నెలకు రూ. 18,000 గౌరవ వేతనం అందజేయబోతున్నట్లు స్పష్టం చేశారు.

అయితే ఈ పథకం రిజిస్ట్రేషన్ రేపటి నుంచి ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. హనుమాన్ ఆలయంలో తానే ఈ ప్రక్రియను ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ పథకాన్ని అడ్డుకోవడానికి ఎలాంటి కుట్రలు చేయొద్దని బీజేపీని కోరారు. అలాగే మన ఆచార, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందజేయడం కోసం పురోహితులు, గ్రంథీలు చాలా కష్టపడుతున్నారని అరవింద్ కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. అలాంటి వారి కోసం, వారి కుటుంబ సభ్యుల కోసం ఏ ఒక్కరూ ఆర్థిక సాయం చేయలేదని.. అందుకే తాము ఈ పథకం తీసుకు వచ్చినట్లు వివరించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

📢 For Advertisement Booking: 98481 12870