हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

బడ్జెట్‌ పై నిర్మలమ్మ కసరత్తులు..త్వరలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో భేటీ

sumalatha chinthakayala
బడ్జెట్‌ పై నిర్మలమ్మ కసరత్తులు..త్వరలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ రానున్న ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కోసం కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలాసీతారామన్‌ భేటి కానున్నట్లు సమాచారం. డిసెంబర్ 21-22 తేదీల్లో ఈ సమావేశం ఉండనుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. రాజస్థాన్‌లో ఈ సంప్రదింపులు జరగనున్నాయి.

మరోవైపు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌కు సంబంధించి రాష్ట్రాలు తమ సూచనలు తెలియజేసేందుకు రెండురోజుల పాటు ఆర్థిక మంత్రులతో సీతారామన్ భేటీ కానున్నారు. ఆ సమయంలోనే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కూడా ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈసారి జరగబోయేది 55వ జీఎస్టీ మండలి సమావేశం. ఇదిలాఉంటే.. జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీని రద్దు చేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నవేళ సెప్టెంబర్‌లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలోనే నిర్ణయం వెలువడుతుందని అందరూ ఆశించారు. కానీ, దీనిపై సుదీర్ఘంగా చర్చించిన మండలి.. మంత్రుల బృందానికి ఆ బాధ్యతను అప్పగించింది.

కాగా, గత నెలలో, ఆరోగ్య మరియు జీవిత బీమా జీఎస్టీపై మంత్రుల బృందం (GoM) టర్మ్ జీవిత బీమా పాలసీలకు చెల్లించే బీమా ప్రీమియంలను మరియు జీఎస్టీ నుండి సీనియర్ సిటిజన్‌ల ఆరోగ్య బీమాను మినహాయించడంపై విస్తృతంగా అంగీకరించింది. అలాగే, రూ. 5 లక్షల వరకు కవరేజీతో ఆరోగ్య బీమా కోసం సీనియర్ సిటిజన్లు కాకుండా ఇతర వ్యక్తులు చెల్లించే ప్రీమియంలపై జీఎస్‌టీని మినహాయించాలని ప్రతిపాదించారు. అయితే, రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఆరోగ్య బీమా కవరేజీ ఉన్న పాలసీలకు చెల్లించే ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీ కొనసాగుతుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870