ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు

ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు

బోయింగ్ 777 విమానం ముంబయి నుంచి న్యూయార్క్ వెళ్తుంది. నాలుగు గంటల తర్వాత అజర్బైజన్ ప్రాంతంలో గగనతలంలో ఉండగా బెదిరింపులు వచ్చాయి. సిబ్బంది వెంటనే అప్రమత్తమై పైలట్లకు తెలపడంతో వారు ముంబయి వైపు విమానాన్ని మళ్లించారు. అక్కడ ల్యాండ్ అయిన వెంటనే బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ రంగంలోకి దిగి, తనిఖీలు చేపట్టింది. అది నకిలీ కాల్ అని తెలుస్తోంది. విమానంలో సిబ్బందితో కలిపి 322 మంది ప్రయాణికులున్నారు. తనిఖీల అనంతరం మంగళవారం తెల్లవారుజామున తిరిగి న్యూయార్క్ బయల్దేరనున్నట్లు ఎయిరిండియా వెల్లడించింది.

ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు

తాజాగా ఘటనతో ఆందోళన

గత డిసెంబర్ లో అజర్ బైజన్ ఎయిర్లైన్స్ కు చెందిన జె2-8243 విమానం ప్రమాదానికి గురికావడంతో 38 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. బాకు నుంచి రష్యాలోని చెచెన్ ప్రాంతానికి చెందిన గ్రోజ్నికి ప్రయాణిస్తుండగా కజకిస్థాన్లో ని అక్టోలో అది కూలిపోయింది. రష్యా క్షిపణి తాకడం వల్ల విమానం కూలిందంటూ అప్పట్లో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఈ ఘటన ఆందోళన కలిగించింది.

తరచూ గా ఎయిరిండియా వార్తల్లో

ఇక ఇటీవల ఎయిరిండియా తరచూ వార్తల్లో నిలుస్తోంది. విమానాశ్రయంలో ఓ వృద్ధురాలికి వీల్బైర్ సదుపాయం కల్పించకపోవడంతో నడుచుకుంటూ వెళ్లిన ఆమె కిందపడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. తాము బుక్ చేసుకున్నప్పటికీ.. ఎయిరిండియా సిబ్బంది ఛైర్ ఇవ్వలేదని ఆమె బంధువులు ఆరోపించారు. ఇక షికాగో నుంచి దిల్లీకి బయల్దేరిన విమానంలో టాయిలెట్లు మూసుకుపోవడంతో.. 10 గంటలు ప్రయాణం అనంతరం విమానం వెనక్కి మళ్లిన సంగతి తెలిసిందే

Related Posts
ఢిల్లీ కొత్త సీఎం రేఖా గుప్తా సహా ఐదుగురిపై క్రిమినల్ కేసులు
రేఖా గుప్తా

న్యూఢిల్లీ: ఢిల్లీలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా సహా కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ఏడుగురు మంత్రుల్లో ఐదుగురిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు Read more

ఏఐ బడ్జెట్లో 3 కేంద్రాలకు కోట్లు కేటాయింపు
ఏఐ బడ్జెట్లో 3 కేంద్రాలకు కోట్లు కేటాయింపు

భారతదేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో తన శక్తిని పెంచుకోవడంపై పెద్ద చర్యలు తీసుకుంటోంది. 2025-26 యూనియన్ బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన Read more

ప్రపంచంలోనే కాలుష్య రాజధానిగా ఢిల్లీ
ప్రపంచంలోనే కాలుష్య రాజధానిగా ఢిల్లీ

భారత దేశ రాజధాని నగరం ఢిల్లీలో కాలుష్యంపై ఏడాది పొడవునా చర్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నంత కాలుష్యం మన దేశంలోనే కాదు మరే దేశంలోని Read more

శబరిమల భక్తులకు దేవస్థానం బోర్డు శుభవార్త
Good news from the temple board for Sabarimala devotees

తిరువనంతపురం: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు ట్రావన్‌కోర్‌ దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది. సన్నిధానం వద్ద 18 మెట్లను నేరుగానే ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శనం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *