ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు

ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు

బోయింగ్ 777 విమానం ముంబయి నుంచి న్యూయార్క్ వెళ్తుంది. నాలుగు గంటల తర్వాత అజర్బైజన్ ప్రాంతంలో గగనతలంలో ఉండగా బెదిరింపులు వచ్చాయి. సిబ్బంది వెంటనే అప్రమత్తమై పైలట్లకు తెలపడంతో వారు ముంబయి వైపు విమానాన్ని మళ్లించారు. అక్కడ ల్యాండ్ అయిన వెంటనే బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ రంగంలోకి దిగి, తనిఖీలు చేపట్టింది. అది నకిలీ కాల్ అని తెలుస్తోంది. విమానంలో సిబ్బందితో కలిపి 322 మంది ప్రయాణికులున్నారు. తనిఖీల అనంతరం మంగళవారం తెల్లవారుజామున తిరిగి న్యూయార్క్ బయల్దేరనున్నట్లు ఎయిరిండియా వెల్లడించింది.

ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు

తాజాగా ఘటనతో ఆందోళన

గత డిసెంబర్ లో అజర్ బైజన్ ఎయిర్లైన్స్ కు చెందిన జె2-8243 విమానం ప్రమాదానికి గురికావడంతో 38 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. బాకు నుంచి రష్యాలోని చెచెన్ ప్రాంతానికి చెందిన గ్రోజ్నికి ప్రయాణిస్తుండగా కజకిస్థాన్లో ని అక్టోలో అది కూలిపోయింది. రష్యా క్షిపణి తాకడం వల్ల విమానం కూలిందంటూ అప్పట్లో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఈ ఘటన ఆందోళన కలిగించింది.

తరచూ గా ఎయిరిండియా వార్తల్లో

ఇక ఇటీవల ఎయిరిండియా తరచూ వార్తల్లో నిలుస్తోంది. విమానాశ్రయంలో ఓ వృద్ధురాలికి వీల్బైర్ సదుపాయం కల్పించకపోవడంతో నడుచుకుంటూ వెళ్లిన ఆమె కిందపడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. తాము బుక్ చేసుకున్నప్పటికీ.. ఎయిరిండియా సిబ్బంది ఛైర్ ఇవ్వలేదని ఆమె బంధువులు ఆరోపించారు. ఇక షికాగో నుంచి దిల్లీకి బయల్దేరిన విమానంలో టాయిలెట్లు మూసుకుపోవడంతో.. 10 గంటలు ప్రయాణం అనంతరం విమానం వెనక్కి మళ్లిన సంగతి తెలిసిందే

Related Posts
అమరావతిలో ప్రధాని మోడీ పర్యటన !
Prime Minister Modi visit to Amaravati!

న్యూఢిల్లీ: రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగనుంది. రాజధాని పనుల్ని వచ్చే నెలలో అట్టహాసంగా ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం Read more

భారీ పోలీసుల భద్రత మధ్య దళిత జంట పెళ్లి
bridegroom

సుమారు 200 మంది పోలీసుల భద్రత మధ్య దళిత వరుడు గుర్రంపై ఊరేగాడు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి బారత్‌గా దళిత వధువు గ్రామానికి చేరుకున్నాడు. ఈ Read more

అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ – తమిళనాడు నుండి కాశ్మీర్ వరకు రైలు
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ - తమిళనాడు నుండి కాశ్మీర్ వరకు రైలు

తమిళనాడు నుండి కాశ్మీర్ వరకు ప్రయాణం చేయదలచిన ప్రయాణికులకు త్వరలో సౌకర్యవంతమైన, వేగవంతమైన రైలు సేవ లభించనుంది. దక్షిణ రైల్వే కన్యాకుమారి లేదా రామేశ్వరం నుండి జమ్మూ-కాశ్మీర్ Read more

బడ్జెట్‌ పై నిర్మలమ్మ కసరత్తులు..త్వరలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో భేటీ
Nirmalamma exercises on the budget.meeting with the finance ministers of the states soon

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ రానున్న ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కోసం కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలాసీతారామన్‌ భేటి కానున్నట్లు సమాచారం. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *