Pawan Kalyan :బీజేపీ ఆవిర్భావ దినోత్సవం..వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ ట్వీట్

Pawan Kalyan :బీజేపీ ఆవిర్భావ దినోత్సవం..వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ ట్వీట్

భారత రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన రోజు 1980, ఏప్రిల్ 6. దేశానికి ఒక కొత్త దిశను చూపించాలనే సంకల్పంతో శ్యామప్రసాద్ ముఖర్జీ, దిందయాల్ ఉపాధ్యాయ, అటల్ బిహారి వాజ్‌పేయి, ఎల్కే అద్వానిల నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) స్థాపించబడింది.అప్పుడు కేవలం ఇద్దరు ఎంపీలతో ప్రారంభమైన ఈ ప్రయాణం, నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా నిలిచింది. ఎన్నో ఒడిదొడుకులు, రాజకీయ శత్రుత్వాలు ఎదుర్కొంటూ బీజేపీ పార్టీ ముందుకు సాగింది. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్యకర్తల మద్దతుతో, లక్షలాది మంది ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని విజయపథంలో దూసుకెళ్తోంది.ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా బీజేపీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Advertisements

శుభాకాంక్షలు

భారతీయ జనతా పార్టీ 46వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు” అని తెలిపారు పవన్ కల్యాణ్ . ఆయన బీజేపీతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ రాజకీయాల్లో ఎన్డిఏ భాగస్వామిగా పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ బీజేపీతో కలిసి పనిచేస్తోంది.చారిత్రాత్మక ఉద్యమం ద్వారా బీజేపీ పార్టీ పుట్టింది. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి, ఎల్కే అద్వానీ లాంటి నేతలు ప్రజాస్వామ్య భారత్ కోసం పార్టీ స్థాపనకు కృషి చేశారు. దేశానికి సేవ చేయాలని ఆ మహనీయులు స్థాపించిన పార్టీఇప్పుడు కోట్ల మంది ఆశయాలను నెరవేరుస్తోంది.ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల కృషి వల్ల ప్రపంచంలోనే బీజేపీ అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది. దేశంలో మూడు పర్యాయాలుగా ప్రజలకు సేవలు అందిస్తోంది. ఈ చరిత్రాత్మక సందర్భంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే రాష్ట్రంలోని బీజేపీ కార్యకర్తలు, నాయకులకు శుభాకాంక్షలు చెబుతున్నా” అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది. రాబోయే ఎన్నికల్లో మరిన్ని విజయాలను సాధించి, దేశాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. శ్యామ ప్రసాద్ ముఖర్జీ కలలలోని “ఏక భారత, శ్రేష్ఠ భారత” సంకల్పాన్ని నిజం చేసేందుకు బీజేపీ నిత్యం ప్రయత్నిస్తోంది.ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ట్వీట్ ప్రాధాన్యతను సంతరించుకుంది.

Related Posts
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
tg govt

తెలంగాణ ప్రభుత్వం దీపావళి సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించింది. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను 3.64 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెరిగిన డీఏ Read more

Vijay Sethupathi: విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ సినిమా
Vijay Sethupathi: పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్! విజయ్ సేతుపతితో కొత్త సినిమా

హిట్‌ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమాల కోసం ఎదురు చూసే సినీ ప్రియులు ఎంతో మంది ఉన్నారు. ఆయన టేకింగ్, పవర్‌ఫుల్ మాస్ Read more

Yasangi : త్వరలో అకౌంట్లోకి డబ్బులు
bonas

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సీజన్‌లో రైతులకు ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్‌లో సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ Read more

ఏపీ యువతకు చంద్రబాబు శుభవార్త
ఏపీ యువతకు చంద్రబాబు శుభవార్త

దాదాపు రెండు దశాబ్ధాల కిందట ఐటీ రంగం ప్రాముఖ్యతను దేశంలో ముందుగా గ్రహించి అమెరికా దిగ్గజ కంపెనీల సీఈవోలను కూడా హైదరాబాదుకు తీసుకొచ్చిన వ్యక్తి ఏపీ సీఎం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×