బుక్కైన సెలెబ్రిటీలు.. రానా, విజయ దేవరకొండ, మంచులక్ష్మి

betting app : బుక్కైన సెలెబ్రిటీలు.. విజయ దేవరకొండ, మంచులక్ష్మి, రానా

బెట్టింగ్ యాప్‌ల రచ్చ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులను తాకింది. గత కొద్దిరోజులుగా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న వారిపై హైదరాబాద్ పోలీస్ చర్యలు చేపట్టింది. ఈ తరుణంలోనే యూట్యూబర్ల నుండి ఆర్టిస్టులకు వరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోటో చేస్తున్నవారిపై కేసులు కూడా నమోదయ్యాయి. సైబరాబాద్ పోలీసులు టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి, విజయ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ సహా ఇతరుల కేసు నమోదు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఆరుగురు సినీ ప్రముఖులు, 19 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌లపై ఈ కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సెక్షన్లు 318 (4), 112 r/w 49, తెలంగాణ గేమింగ్ చట్టంలోని 3, 3 (A) అండ్ 4 అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2008లోని 66D కింద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (FIR) బుక్ చేసారు.

Advertisements
బుక్కైన సెలెబ్రిటీలు.. రానా, విజయ దేవరకొండ, మంచులక్ష్మి

మియాపూర్ నివాసి ఫణింద్ర శర్మ అనే వ్యక్తి ఫిర్యాదు
మియాపూర్ నివాసి ఫణింద్ర శర్మ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్, వెబ్‌సైట్స్ ఇంకా ఇతర ప్లాట్‌ఫామ్స్ ని చాల మంది ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌లను ప్రోత్సహిస్తున్నారని అతను పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్‌ల ప్రచారం సమాజాన్ని ఇంకా యువతకు హాని కలిగిస్తున్నాయని, వీటి బారిన పడి తీవ్ర ఆర్ధిక ఒత్తిడికి గురవుతున్నారని ఫిర్యాదుదారుడు తెలిపారు. 1867 పబ్లిక్ గ్యాంబ్లింగ్ చట్టాన్ని ఉల్లంఘించి జూదం ఆడటాన్ని ప్రోత్సహించే మొబైల్ యాప్‌లు, వెబ్‌సైట్‌ల గురించి ఆందోళన వ్యక్తం చేసిన వినయ్ వంగల (40) అనే ప్రైవేట్ ఉద్యోగి చేసిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు ఈ సోమవారం 11 మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లపై కేసు బుక్ చేశారు.

Related Posts
‘మజాకా’ – మూవీ రివ్యూ
'మజాకా' - మూవీ రివ్యూ

కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘మజాకా’ సినిమాలో సందీప్ కిషన్,రావు రమేష్,రీతూ వర్మ, అన్షు నటించారు.‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ తర్వాత కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సందీప్ కిషన్, ‘భైరవకోన’తో Read more

ముంబైలో “డిజిటల్ అరెస్ట్” పేరిట మహిళను మోసం చేసిన నకిలీ పోలీసుల బృందం
digital arrest

ముంబైలో ఒక మహిళను ఓ మోసపూరిత స్మగ్లర్ బృందం మోసం చేసింది. వీడియో కాల్ ద్వారా ఆమెను బలవంతంగా నగ్నంగా చేయించి ₹1.7 లక్షలు దోచుకున్నారు. పోలీసులు Read more

ఈసీ పై మళ్లీ అనుమానాలు
narendra modi kejriwal

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా వెలువడుతోన్నాయి. బీజేపీ ప్రభంజనం సృష్టిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ వెనుకపడినట్టే. Read more

కుంభమేళా భక్తులకు సగం ధరకే విమాన టికెట్ల ధరలు
kumbh mela flight charges

కుంభమేళా సందర్భంగా భక్తులకు సగం ధరకే విమాన టికెట్లు అందించనున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఈ నిర్ణయం భక్తులకు ఆర్థిక భారం తగ్గించేందుకు సహాయపడనుంది. Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×