భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో మిగిలిన మ్యాచ్లను వారం రోజుల పాటు వాయిదా వేసినట్లు ప్రకటించింది. భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో, ఆటగాళ్ల భద్రతను ప్రాధాన్యమిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపారు.భద్రతా పరమైన కారణాల వల్ల క్రికెట్ మ్యాచ్లను కొనసాగించడం సాధ్యం కాదని బీసీసీఐ భావించింది. ఈ క్రమంలోనే, మే 8న ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ మధ్యలోనే నిలిపివేయబడింది. ఇదే తరహాలో, ఈ రోజు లక్నో సూపర్ జెయింట్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వాయిదా పడింది.బీసీసీఐ తాజా నిర్ణయంతో, నేటి నుంచి ఐపీఎల్ యొక్క అన్ని మ్యాచ్లను తాత్కాలికంగా నిలిపివేస్తూ వాయిదా వేయాలని నిర్ణయించింది.
ఈ నిర్ణయం ద్వారా నేటి నుంచి జరగాల్సిన అన్ని ఐపీఎల్ పోటీలను వాయిదా వేయడం జరిగింది. ఈ అనూహ్య పరిణామంతో, ఇప్పటికే టికెట్లు బుక్ చేసిన అభిమానులకు ఆయా ఫ్రాంచైజీలు రీఫండ్ ప్రాక్రియను ప్రారంభించాయి.ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, మే 10న హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్ మరియు సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగాల్సి ఉండేది. అయితే, బీసీసీఐ తీసుకున్న వాయిదా నిర్ణయంతో ఈ మ్యాచ్ కూడా రద్దయింది. దీంతో, సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తమ అభిమానులకు టికెట్ రీఫండ్ ప్రక్రియను చేపట్టింది.
భారతదేశంలో ప్రస్తుతం ఉన్న సున్నితమైన భద్రతా పరిస్థితుల దృష్ట్యా, క్రికెట్ మ్యాచ్ల నిర్వహణకు అనుకూలమైన పరిస్థితులు లేవని బీసీసీఐ భావించింది. ఆటగాళ్ల భద్రతే ప్రధానం, అందుకే ఈ కీలకమైన నిర్ణయం తీసుకున్నామని వారు చెప్పారు.ఈ అనూహ్య పరిణామం నేపథ్యంలో, ఐపీఎల్ అభిమానులు ఇప్పుడు కొత్త అప్డేట్ల కోసం ఎదురు చూస్తున్నారు. బీసీసీఐ, ఫ్రాంచైజీలు ఈ నిర్ణయాన్ని అందరికీ సురక్షితంగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నాయని చెప్పారు.ఈ పరిణామం క్రికెట్ ప్రేమికులలో ఆశాభంగం కలిగించవచ్చు, కానీ తదుపరి మ్యాచ్లపై మరింత సమాచారం రావడంతో అభిమానులు తిరిగి ఉత్సాహంగా ఉండాలని బీసీసీఐ ఆశిస్తోంది.
Read Also : Andhra Pradesh : ప్రకాశం జిల్లాలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత