బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) పాకిస్థాన్ సైన్యం హైజాక్ ఆపరేషన్ గురించి తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించింది. పాక్ సైన్యం హైజాకర్లను హతమార్చినట్లు చెప్పినప్పటికీ, నిజానికి బందీలందరూ తమ వద్దే ఉన్నారని బీఎల్ఏ స్పష్టం చేసింది.
జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ – 400 మందికిపైగా బందీలు
క్వెట్టా నుండి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును మిలిటెంట్లు హైజాక్ చేశారు. ఈ ఘటనలో 9 బోగీల్లో 400 మందికిపైగా ప్రయాణికులు బందీలుగా మారారు. హైజాకర్లను ఎదుర్కొనడానికి పాక్ ఆర్మీ రంగంలోకి దిగింది. పాక్ ఆర్మీ ప్రకటన – హైజాకర్లను హతమార్చామన్న పాక్. 21 మంది ప్రయాణికులు, నలుగురు పాక్ సైనికులు మృతిచెందినట్లు తెలిపింది. 33 మంది హైజాకర్లను హతమార్చినట్లు ప్రకటించింది. బందీలను రక్షించామని పాక్ సైన్యం ప్రకటించింది.

పాక్ ఆర్మీ ప్రకటనపై స్పందించిన బీఎల్ఏ
పాక్ ఇంకా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడింది. పాక్ సైన్యంతో పోరాటం ఇంకా కొనసాగుతోందని తెలిపింది. బందీలు తమ అదుపులోనే ఉన్నారని స్పష్టం చేసింది. ఖైదీల మార్పిడికి తాము సిద్ధమని, కానీ చర్చలకు పాక్ నిరాకరించిందని ఆరోపించింది. బలూచిస్థాన్లో స్వతంత్ర జర్నలిస్టులను పంపాలని బీఎల్ఏ డిమాండ్. ఘటనపై నిజాలను తెలుసుకునేందుకు స్వతంత్ర జర్నలిస్టులను పంపాలని ప్రతిపాదించింది. పాక్ సైన్యం తమ సొంత సైనికులను గాలికి వదిలేసిందని ఆరోపించింది.
ఆఫ్ఘనిస్థాన్ తీవ్రవాదుల ప్రమేయం ఉందన్న పాక్ ఆరోపణలపై తాలిబన్ స్పందన
పాకిస్థాన్, ఈ హైజాక్ ఘటన వెనుక ఆఫ్ఘనిస్థాన్ తీవ్రవాదుల హస్తం ఉందని ఆరోపించింది. అయితే, తాలిబన్ ప్రభుత్వం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. పాక్ తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు తాలిబన్ ఆరోపించింది. జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ ఘటనపై పాకిస్థాన్ మరియు బలూచ్ లిబరేషన్ ఆర్మీ విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. బీఎల్ఏ ప్రకటన ప్రకారం, హైజాక్ ఆపరేషన్ ఇంకా ముగియలేదని, బందీలు తమ అదుపులోనే ఉన్నారని స్పష్టం చేసింది. మరోవైపు, పాక్ సైన్యం మాత్రం హైజాకర్లను హతమార్చామని ప్రకటించడం గమనార్హం. నిజమైన పరిస్థితి ఏంటనేది మరింత స్పష్టతకు రావాల్సి ఉంది.