हिन्दी | Epaper
అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

టీచర్ల బదిలీపై బాబు సర్కార్ కీలక నిర్ణయం

Sharanya
టీచర్ల బదిలీపై బాబు సర్కార్ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఉపాధ్యాయుల బదిలీల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించగా, అంతకు ముందుగా వారి సర్వీస్ సీనియార్టీ జాబితాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా, ఉపాధ్యాయ సంఘాలతో అధికారులు సమావేశాలు నిర్వహిస్తూ, సీనియార్టీ లెక్కింపు విధానాన్ని ఖరారు చేస్తున్నారు. గతంలో టీచర్ల బదిలీల్లో పారదర్శకత కరువైందనే విమర్శలు రావడంతో, ప్రభుత్వం త్వరలో అసెంబ్లీలో ఓ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించేందుకు సన్నాహాలు చేస్తోంది. సీనియార్టీ జాబితాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచే ప్రక్రియ కొనసాగుతోంది. జాబితా విడుదల తర్వాత, అభ్యంతరాలు స్వీకరించి తుది జాబితాను ప్రకటించనున్నారు.

VSP15 STUDENTS 6

పారదర్శకంగా బదిలీల ప్రక్రియ:
గతంలో టీచర్ల బదిలీల్లో అక్రమాలు, అవినీతి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. త్వరలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని యోచిస్తోంది.
ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాను పూర్తిగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
బదిలీల విధానంపై ఉపాధ్యాయుల సూచనలు తీసుకుని తుది నిర్ణయాలు తీసుకోనున్నారు.

సీనియార్టీ లెక్కింపు – ముఖ్యాంశాలు:
8 ఏళ్ల సర్వీసు పూర్తి కాకముందే రిక్వెస్ట్ పెట్టుకుని బదిలీ అయినా, పరస్పర బదిలీల ద్వారా స్కూల్ మారినా, వారికి పాత స్కూల్‌ సర్వీస్‌గా లెక్కించనున్నారు. 8 ఏళ్లు పూర్తయిన తర్వాత తప్పనిసరిగా బదిలీ చేయనున్నారు. పీఈటీ, పీడీలు తమ స్కూల్స్ వదిలి ఇతర కార్యక్రమాలకు వెళ్లేందుకు అనుమతించరాదని నిర్ణయం తీసుకున్నారు. అలాగే త్వరలో విడుదల చేసే సీనియార్టీ జాబితాపై అభ్యంతరాలు ఉంటే సేకరించి తుది జాబితా రిలీజ్ చేయనున్నారు. అలాగే పీఈటీ, పీడీలు తమ స్కూల్స్ వదిలి ఇతర కార్యక్రమాలకు వెళ్లేందుకు అనుమతించకూడదని నిర్ణయించారు.

ప్రతి మూడో శనివారం సమావేశాలు:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల మూడో శనివారం స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశాలు మధ్యాహ్నం 1:00 నుంచి 5:00 గంటల వరకు కొనసాగుతాయి.
ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుంది. గతంలో మొత్తం రోజు సమావేశాలు ఉండటంతో పాఠశాల నిర్వహణకు ఇబ్బందులు వచ్చేవి, అందుకే మధ్యాహ్నం సగం రోజు నిర్వహణకు మార్పులు చేశారు. 1, 2 తరగతులు & 3, 4, 5 తరగతుల ఉపాధ్యాయులకు వేర్వేరు రిసోర్స్ పర్సన్‌లను నియమించనున్నారు. సెకండరీ స్థాయిలో 7 రకాల సబ్జెక్టుల టీచర్లను వర్గీకరించాలని నిర్ణయం తీసుకున్నారు.

పదో తరగతి ప్రీఫైనల్ పరీక్ష షెడ్యూల్:
ఈరోజు (ఫిబ్రవరి 15) స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశం ఉన్న నేపథ్యంలో, పదో తరగతి ప్రీఫైనల్ గణిత పరీక్ష ఉదయం 8:45 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు నిర్వహించనున్నారు. ఈ మార్పులు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అనుకూలంగా ఉంటాయని విద్యాశాఖ పేర్కొంది. పరీక్ష షెడ్యూల్‌ను స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాలకు అనుగుణంగా మారుస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలు ఉపాధ్యాయుల బదిలీల్లో పారదర్శకతను పెంచడంతో పాటు, విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరచేందుకు దోహదపడనున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సంక్రాంతి పండుగకు తెలంగాణ–ఏపీ ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండుగకు తెలంగాణ–ఏపీ ప్రత్యేక రైళ్లు

TET 2025 ప్రాథమిక కీలు పూర్తి వివరాలు

TET 2025 ప్రాథమిక కీలు పూర్తి వివరాలు

ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రితో బాబు భేటీ

ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రితో బాబు భేటీ

డ్వాక్రా మహిళల బ్యాంక్ ఖాతాలపై తప్పుడు ప్రచారం..ఏపీ ఫ్యాక్ట్ చెక్ ఖండన

డ్వాక్రా మహిళల బ్యాంక్ ఖాతాలపై తప్పుడు ప్రచారం..ఏపీ ఫ్యాక్ట్ చెక్ ఖండన

గోదావరి వాటర్ గ్రిడ్ శంకుస్థాపన చేయనున్న పవన్

గోదావరి వాటర్ గ్రిడ్ శంకుస్థాపన చేయనున్న పవన్

మేనేజర్ ధైర్యంతో బ్యాంకు దోపిడీ విఫలం

మేనేజర్ ధైర్యంతో బ్యాంకు దోపిడీ విఫలం

శుభవార్త చెప్పిన సీఎం.. జిల్లాకు 200 పెన్షన్లు..

శుభవార్త చెప్పిన సీఎం.. జిల్లాకు 200 పెన్షన్లు..

ఏపీలో లక్ష ఉద్యోగాలను వైసీపీ అడ్డుకుంటోంది: నారా లోకేశ్

ఏపీలో లక్ష ఉద్యోగాలను వైసీపీ అడ్డుకుంటోంది: నారా లోకేశ్

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, కేన్సర్ రోగులకు పింఛన్‌

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, కేన్సర్ రోగులకు పింఛన్‌

సరోజిని గ్యాంగ్‌ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

సరోజిని గ్యాంగ్‌ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం కీలక వ్యాఖ్యలు

కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం కీలక వ్యాఖ్యలు

రాజమహేంద్రవరంలో మంత్రి లోకేశ్‌ పర్యటన..

రాజమహేంద్రవరంలో మంత్రి లోకేశ్‌ పర్యటన..

📢 For Advertisement Booking: 98481 12870