రైలు హైజాకర్లను అంతమొందించిన ఆర్మీ..బందీలకు విముక్తి!

రైలు హైజాకర్లను అంతమొందించిన ఆర్మీ..బందీలకు విముక్తి!

పాకిస్థాన్‌లో రైలు హైజాక్ చేసిన మిలిటెంట్లను పాక్ సైనికులు అంతమొందించారు. బందీలుగా ఉన్న ప్రయాణికులను కాపాడారు. అయితే, ఈ ఘటనలో మొత్తం 21 మంది ప్రయాణికులతోపాటు నలుగురు పారామిలిటరీ సైనికులు మృతి చెందినట్లు పాక్ ఆర్మీ జనరల్ తెలిపారు. పాక్ భద్రతా బలగాల కాల్పుల్లో మొత్తం 33 మంది మిలిటెంట్లు మృతి చెందారని పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి, లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ వెల్లడించారు. రైలులో ఉన్న అందరు మిలిటెంట్లను భద్రతా బలగాలు హతమార్చాయని.. ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని సదరు అధికారి తెలిపారు. దీంతో మిగిలిన ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు.

Advertisements
రైలు హైజాకర్లను అంతమొందించిన ఆర్మీ..బందీలకు విముక్తి!

రైలు హైజాక్ బీఎల్ఏ మిలిటెంట్ల పనే

కాగా, బలూచిస్థాన్ ప్రావిన్సులోని పర్వత ప్రాంతమైన క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులోని పెషావర్‌కు వెళుతున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ (Jaffar Express) రైలును బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) మిలిటెంట్లు హైజాక్ చేసిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన సమయంలో 9 కోచ్‌లలో మొత్తం 440 మంది ప్యాసింజర్లు ఉన్నారు. రైలును హైజాక్ చేసింది తామేనని బీఎల్ఏ మిలిటెంట్లు ప్రకటించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పాక్ భద్రతా బలగాలు మిలిటెంట్లపై కాల్పులతో విరుచుకుపడ్డాయి. మిలిటెంట్లను అంతమొందించి రైలును తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు పాక్ ఆర్మీ అధికారులు ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం బీఎల్ఏ మిలిటెంట్లు రైల్వే ట్రాక్ పేల్చేసి రైలును హైజాక్ చేశారని చెప్పారు. ఈ క్రమంలోనే పాక్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఫ్రాంటియర్ కార్ప్స్, స్పెషల్ సర్వీస్ గ్రూప్ కమాండోస్ తో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టామని లెఫ్టినెంట్ జనరల్ షరీఫ్ మీడియాకు వెల్లడించారు. ఈ ఆపరేషన్ సమయంలో మిలిటెంట్లు ఆఫ్గాన్‌లోని తమ సహాయకులు, సూత్రధారులతో శాటిలైట్ ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలసుకున్నారని చెప్పారు.

మిలిటెంట్లందరినీ మట్టుబెట్టామని ఆర్మీ ప్రకటన
ప్రయాణికులను రక్షణ కవచాలుగా చేసుకోవడంతో ఈ ఆపరేషన్ ముగించేందుకు సమయం పట్టిందని లెఫ్టినెంట్ జనరల్ తెలిపారు. మంగళవారం సాయంత్రానికి 100 మంది ప్రయాణికులను, బుధవారం నాటికి మిగితా ప్రయాణకులను సురక్షితంగా కాపాడామని చెప్పారు. ఈ ఆపరేషన్ అత్యంత ఖచ్చిత్వంతోపాటు జాగ్రత్తగా చేయాల్సి వచ్చిందని వివరించారు. మొదట ఆత్మాహుతి బాంబర్లను స్నిపర్స్ చంపేశారని, ఆ తర్వాత ఒక్కో కంపార్ట్‌మెంట్‌లోని మిలిటెంట్లను హతమారుస్తూ వచ్చామని పాక్ జనరల్ వెల్లడించారు. ప్రయాణికులకు ఎలాంటి హాని జరగలేదన్నారు. మిలిటెంట్లందరినీ మట్టుబెట్టామని చెప్పారు. ప్రయాణికులందరినీ కాపాడామని చెప్పారు. పాకిస్థానీయును లక్ష్యంగా చేసుకునే ఏ విదేశీ శక్తులను సాగనివ్వమని ఆయన చెప్పుకొచ్చారు.

Related Posts
నేడు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు
ఆప్ వెనుకంజకి ప్రధాన కారణాలు ఏంటి?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ప్రధాన పార్టీలైన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మరియు భారతీయ జనతా Read more

రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులకు మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్
Minister strong warning to registration department employees

తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి సమస్యపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజల నుంచి అవినీతిపై ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా, ఉద్యోగులు Read more

New Rules : నేటి నుంచి కొత్త రూల్స్
apr1

ప్రభుత్వం తాజా ఆర్థిక సంవత్సరం ప్రారంభం సందర్భంగా పన్ను మినహాయింపుల్లో కొన్ని కీలక మార్పులను తీసుకువచ్చింది. స్టాండర్డ్ డిడక్షన్ రూ.75,000తో కలుపుకుని మొత్తం రూ.12.75 లక్షల వరకు Read more

రాసిచ్చిన ఆస్తి వెనక్కి తీసుకోవచ్చు..ఏపీ ప్రభుత్వం ఆదేశాలు
CBN AP Govt

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వయోవృద్ధ తల్లిదండ్రుల హక్కులను పరిరక్షించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. తమను పట్టించుకోని పిల్లలు లేదా వారసులపై తల్లిదండ్రులు చర్యలు తీసుకునే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం Read more

×