APPSC Group 2 Mains Results:ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ ఫలితాలు విడుదల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఎప్పుడంటే!

APPSC Group 2 Mains Results:ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ ఫలితాలు విడుదల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఎప్పుడంటే!

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( ఏపీపీఎస్సీ) గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది.మొత్తం 905 గ్రూప్ 2 ఉద్యోగాలకు ఈ ఏడాది ఫిబ్రవరి 23న మెయిన్స్‌ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ధ్రువపత్రాల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది.స్పోర్ట్స్‌ కోటాతో సహా మొత్తం 2,517 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరందరికీ ధ్రువపత్రాల తనిఖీ తేదీలను కాల్‌ లెటర్ల ద్వారా తెలియజేయనున్నట్టు అధికారులు తెలిపారు.

Advertisements

రోస్టర్‌ పాయింట్ల

గ్రూప్‌-2 ఉద్యోగ నియామకాల్లో రోస్టర్‌ పాయింట్ల అంశంపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. హైకోర్టు తుది తీర్పునకు లోబడి తుది నియామక ప్రక్రియ చేపట్టనున్నట్టు ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. గ్రూప్‌ 2 మెయిన్స్‌ ఫలితాలతో పాటు మెయిన్‌ పరీక్ష ఫైనల్‌ ‘కీ’ని కూడా అధికారులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

pecet1a

2023 డిసెంబర్‌లో ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 నోటిఫికేషన్ విడుదలైంది. అయితే అందులో రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. అయినా వాటిని ఏపీపీఎస్సీ పట్టించుకోలేదు. ఫిబ్రవరిలో ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించింది. దీనిపై పోరాటం ఉద్ధృతం చేసిన అభ్యర్థులు కోర్టు మెట్లు ఎక్కారు. దీంతో ప్రక్రియ ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే కోర్టుల్లో ఈ కేసులు వీగిపోవడంతో గ్రూప్‌ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ సిద్ధమైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే దీన్ని వాయిదా వేయాలని కోర్టులో మరో కేసు ఇంకా పెండింగ్‌లో ఉండగానే పరీక్ష నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు.మెయిన్స్‌ పరీక్షకు రెండు రోజుల ముందు నుంచి అభ్యర్థులు ఆందోళన మరింత తీవ్రం చేశారు. హైదరాబాద్ నుంచి విశాఖ వరకు ఈ ఆందోళన ఉద్ధృతమైంది. పరీక్షకు ఒక్క రోజు ముందు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల విన్నపాన్ని మన్నించి పరీక్ష వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి సూచనలు చేసింది.పరీక్ష వాయిదాకు ప్రభుత్వం ఓకే చెప్పినప్పటికీ ఏపీపీఎస్సీ మాత్రం పట్టు వీడలేదు.అప్పటికే ఎమ్మెల్సీ కోడ్ ఉన్నందున ప్రభుత్వ ఆదేశాలను పాటించలేమని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. దీంతో అనుకున్నట్టుగానే పరీక్షను నిర్వహించింది. తాజాగా ఏపీపీఎస్సీ ఫలితాలను విడుదల చేసింది.

Related Posts
తెలంగాణ లాసెట్, పీజీ ఎల్ సెట్ షెడ్యూల్ విడుదల
Telangana Lawset, PG L Set schedule released

హైదరాబాద్‌: లా కోర్సుల్లో ప్రవేశాలకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక ప్రకటన చేసింది. లాసెట్, పీజీ ఎల్సెట్ నోటిఫికేషన్‌ షెడ్యూల్‌ను శనివారం Read more

Telangana: తెలంగాణ రేషన్‌ కార్డుదారులకు గుడ్ న్యూస్
Telangana: తెలంగాణ రేషన్‌ కార్డుదారులకు గుడ్ న్యూస్

తెలంగాణలో రేషన్‌ కార్డు లబ్ధిదారులకు గుడ్‌ న్యూస్‌. దేశంలోనే సన్నబియ్యం పంపిణీ చేపట్టిన తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించబోతోంది. రేషన్ కార్డుదారులకు నాణ్యమైన సన్న బియ్యం Read more

కాంగ్రెస్‌ మరోసారి నవ్వులపాలైంది – కిషన్ రెడ్డి
kishan reddy warning

మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయి..మరోసారి నవ్వులపాలైందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి 251 స్థానాల్లో విజయం సాధించి కాంగ్రెస్ ను Read more

రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.
రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం (24) నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×