పీవీ సునీల్ ను సస్పెన్షన్ చేసిన ఏపీ ప్రభుత్వం

పీవీ సునీల్ ను సస్పెన్షన్ చేసిన ఏపీ ప్రభుత్వం

ఏపీలో వైసీపీ ప్రభుత్వంలో సీఐడీ ఛీఫ్ గా పనిచేసిన పీవీ సునీల్ కుమార్ ను కూటమి ప్రభుత్వం తాజాగా సస్పెండ్ చేసింది. ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా విదేశీ పర్యటనలు చేసారన్న ఆరోపణలపై క్రమశిక్షణా ఉల్లంఘన కింద ఆయన్ను సస్పెండ్ చేశారు. దీంతో డీఐజీ స్దాయి అధికారిని ఇలా సస్పెండ్ చేయడంపై మాజీ అఖిల భారత సర్వీసు అధికారుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఐఏఎస్ పీవీ రమేశ్ తో పాటు పలువురు దీనిపై స్పందించారు.

Advertisements
పీవీ సునీల్ ను సస్పెన్షన్ చేసిన ఏపీ ప్రభుత్వం

ప్రభుత్వానికి తెలియదా?

డీఐజీ కాకుండా అడ్డుకునేందుకే పీవీ సునీల్ కుమార్ ను ఇలా కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసిందని బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆయన సెలవు తీసుకున్నప్పుడు ఈ విషయం ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. ఆయనేమీ మీలా డిప్లమోటిక్ పాస్ పోర్టుతో ప్రజల డబ్బుతో విదేశాలకు వెళ్లలేదు కదా అని విమర్శలు గుప్పించారు. ఈ రూల్ మిగతా వారికి కూడా అమలు చేస్తే సగం మంది సస్పెండ్ అవుతారన్నారు. అక్కడితే ఆగకుండా చంద్రబాబు, లోకేష్ దావోస్ టూర్ పైనా ప్రవీణ్ కుమార్ ప్రశ్నలు గుప్పించారు.
సునీల్ అరెస్టుపై ఐఏఎస్ పీవీ రమేశ్ స్పందన
మరోవైపు ఏపీలో మాజీ సీనియర్ ఐఏఎస్ పీవీ రమేశ్ మాత్రం పీవీ సునీల్ సస్పెండ్ పై భిన్నంగా స్పందించారు. నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడే అధికారులను ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలన్నారు. అటువంటి నేరాలకు పాల్పడే అధికారులను తగిన ప్రక్రియ తర్వాత సర్వీసు నుండి తొలగించాలన్నారు. తన సొంత భార్యపై తీవ్రమైన నేరాలు చేసిన ఐపీఎస్ అధికారిపై సెషన్స్ కోర్టులో విచారణ జరుగుతోందని, రాజకీయ ప్రోత్సాహం కారణంగా ఆయన పదవిలో కొనసాగారని గుర్తుచేశారు. కులం పేరుతో ఆశ్రయం పొందేందుకు ప్రయత్నించే అటువంటి వ్యక్తులను అందరూ ఖండించాలన్నారు. మతం, కులం, ప్రాంతం ఏదైనా నేరస్థుడు నేరస్థుడే అన్నారు.

Related Posts
సంక్రాంతికి సొంతవూర్లకు వెళ్లేవారికి తీపి కబురు
APSRTC Good News

సంక్రాంతి పండుగ సందర్బంగా తమ సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ నుంచి Read more

డయేరియాతో 10 మంది మృతి..చంద్రబాబుకు సిపిఐ రామకృష్ణ లేఖ !
New law in AP soon: CM Chandrababu

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, లేఖ రాశారు. విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా కారణంగా 10 మంది మరణించగా, వందల మంది Read more

పోలవరం డయాఫ్రంవాల్ కు రూ.990 కోట్లు
పోలవరం డయాఫ్రంవాల్ కు రూ.990 కోట్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన డయాఫ్రంవాల్ (సరిహద్దు గోడ) యొక్క కొత్త నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.990 కోట్ల కేటాయింపునకు జలవనరుల శాఖ అనుమతి ఇచ్చింది. Read more

కోళ్ల పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా
Raghuram and Ganta who went to the Kolla Pandem betting

అమరావతి: ఏపీలో సంక్రాంతి సందర్భంగా జోరుగా కోడి పందెలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తగ్గేదేలే అన్నట్లుగా కోడి పందెలు, వాటిపై Read more

×