బ‌డ్జెట్‌పై జీవీ రెడ్డి ప్ర‌శంస‌లు

బ‌డ్జెట్‌పై జీవీ రెడ్డి ప్ర‌శంస‌లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌పై ఏపీ ఫైబర్‌నెట్ మాజీ ఛైర్మన్ జీవీ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అతి తక్కువ రెవెన్యూ లోటుతో రూ. 3.22 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రణాళికాబద్ధంగా రూపొందించారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ప్రశంసించారు.

Advertisements

జీవీ రెడ్డి ట్వీట్

“నిన్న ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కేవలం రూ. 33,000 కోట్ల అతి తక్కువ రెవెన్యూ లోటుతోనే రూ. 3 లక్షల 22 వేల కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రణాళికాబద్ధంగా రూపొందించారు. నేను నా వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల నాకు ఎప్పటికీ గౌరవం, అభిమానం వుంటాయి.తక్కువ కాలంలోనే టీడీపీలోనూ, ప్రభుత్వ వ్యవస్థలోనూ నాకు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించడం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను.రాష్ట్ర పురోగతికి ఆయనకు మద్దతుగా నిలవడం ప్రతి అభివృద్ధి కోరుకునే తెలుగు వ్యక్తి బాధ్యత” అని జీవీ రెడ్డి ట్వీట్ చేశారు.

రాజకీయ ప్రస్థానం

గతంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తరఫున రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న జీవీ రెడ్డి, టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా కూడా సేవలందించారు.అయితే, ఇటీవ‌ల జీవీ రెడ్డి వ్యక్తిగత కారణాలతో ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వం, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పినా, చంద్రబాబు నాయుడు పట్ల తనకు ఉన్న గౌరవం ఎప్పటికీ మారదని స్పష్టం చేశారు.

2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆర్థిక పరమైన సంస్కరణలు, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చారు. తక్కువ రెవెన్యూ లోటుతో అధిక వ్యయ బడ్జెట్ రూపొందించడం ప్రస్తుత పరిస్థితుల్లో సాహసోపేతమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం 2029లో కూడా మా సార్ ముఖ్యమంత్రి అవ్వాలి. రాష్ట్ర పురోగతికి ఆయనకు మద్దతుగా నిలవడం ప్రతి అభివృద్ధి కోరుకునే తెలుగు వ్యక్తి బాధ్యత” అని జీవీ రెడ్డి ట్వీట్ చేశారు. 

Related Posts
పేర్ని నానిపై ఎటువంటి కక్ష లేదు – నాదెండ్ల మనోహర్
పేర్ని నానిపై ఎటువంటి కక్ష లేదు - నాదెండ్ల మనోహర్

వైసీపీ నేత పేర్ని నానిపై తమకు ఎటువంటి వ్యక్తిగత కక్షా లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. 'మా ప్రభుత్వానికి కుట్రలు చేయాల్సిన అవసరం లేదు. Read more

Rains : 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు : AP
Rains 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు AP

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారబోతోంది.రానున్న 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరిస్తోంది.ముఖ్యంగా ఉత్తర, దక్షిణ కోస్తా Read more

తమిళ సినిమాలు హిందీలో డబ్ చేయకండి – పవన్
భావ తీవ్రత ఉన్నందుకే పోరాట యాత్ర చేసాం - పవన్

తమిళనాడులో హిందీ భాషపై వ్యతిరేకత కొనసాగుతున్న సమయంలో జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. కేంద్ర ప్రభుత్వం హిందీని బలవంతంగా Read more

టీచర్‌ను చంపిన కేసులో విద్యార్థుల అరెస్ట్
Students arrested in the ca

అన్నమయ్య జిల్లా రాయచోటి జడ్పీ హైస్కూల్‌లో జరిగిన ఘటన కలకలం రేపింది. 9వ తరగతి విద్యార్థులు ఇద్దరు తమ ఉపాధ్యాయుడిని దాడి చేసి హత్య చేసిన కేసు Read more

Advertisements
×