ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 3 లక్షల కోట్లు దాటిన పూర్తి స్థాయి బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగిస్తూ, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు భారీ కేటాయింపులు జరిగాయని తెలిపారు. ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీలతో పాటు, ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న ప్రధాన హామీల అమలుకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.
సంక్షేమ పథకాలు
అన్నదాత సుఖీభవ: రైతులకు రూ. 20,000 నగదు సహాయం.
తల్లికి వందనం: ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థుల తల్లుల ఖాతాలో రూ. 15,000 జమ.
ఆరోగ్య భీమా: ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య భీమా పథకం.
ఉచిత విద్యుత్: ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్లు, చేనేత మగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా.
వృద్ధాశ్రయాలు: 12 వృద్ధాశ్రమాల నిర్మాణం.
గృహ నిర్మాణం: ద్వారా 7 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు.
బడ్జెట్ కేటాయింపులు
తల్లికి వందనం పథకం
తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో చదువుకునే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇవ్వనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లల్లో చదివే విద్యార్థులకు తల్లికి వందనం వర్తించనుంది. 1-12వ తరగతుల విద్యార్థులకు తల్లికి వందనం స్కీం వర్తించనుంది. విద్యార్థుల తల్లుల ఖాతాలో తల్లికి వందనం డబ్బులను ప్రభుత్వం జమచేయనుంది. స్కూళ్లు తెరిచే నాటికి తల్లికి వందనం పథకం అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించారు.
ఆరోగ్య రంగం
కార్పోరేట్ వైద్యం అందేలా హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అమలుపై బడ్జెట్లో ప్రస్తావించారు మంత్రి పయ్యావుల. ఈ ఏడాదిలోనే రూ. 25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా పథకం అమలులోకి రానుంది. ఎన్టీఆర్ వైద్య సేవను కొనసాగిస్తూనే ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నట్టు బడ్జెట్లో మంత్రి వెల్లడించారు.
ఉచిత విద్యుత్
ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, చేనేతలకూ ఉచిత విద్యుత్ అమలు చేయనున్నారు. చేనేత మగ్గాలపై ఆధారపడే వారికి 200 యూనిట్ల మేర ఉచిత విద్యుత్ కేటాయించనుంది ప్రభుత్వం.

చేనేత మగ్గాలకు
మరమగ్గాలపై ఆధారపడే వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించనున్నారు. నాయీ బ్రహ్మణుల సెలూన్లకు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం అందించేలా బడ్జెట్లో ప్రస్తావించారు. వృద్ధుల సంరక్షణ కోసం 12 వృద్ధాశ్రామాలు నిర్మించాలని నిర్ణయించారు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 7 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు వచ్చాయి. టిడ్కో ద్వారా 2 లక్షల ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్టులో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. ఇళ్ల నిర్మాణం నిమిత్తం ఎస్సీలకు అదనంగా రూ. 50 వేలు, ఎస్టీలకు అదనంగా రూ. 75 వేలు ఇవ్వనున్నట్టు బడ్జెట్టులో వెల్లడించారు.
మత్స్యకార సంక్షేమం
చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే సాయాన్ని రూ. 10 వేల నుంచి రూ. 20 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీపం 2.0 కింద నిధుల కేటాయింపు కేటాయించనున్నారు. అలాగే ఆదరణ పథకాన్ని కూటమి ప్రభుత్వం పునః ప్రారంభించింది.