हिन्दी | Epaper

YV Subbareddy: విజయసాయిరెడ్డిపై వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Sharanya
YV Subbareddy: విజయసాయిరెడ్డిపై వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు

జగన్ ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డి, అనూహ్యంగా రాజకీయాల నుంచి వైదొలుగుతూ వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించినప్పుడు అది పెద్ద షాక్‌గా మారింది. అయితే ఇటీవల మళ్లీ ఆయన రాజకీయ రంగప్రవేశం జరగడం, ముఖ్యంగా వైసీపీ పాలనపై వ్యాఖ్యలు చేయడం వల్ల రాజకీయ వర్గాల్లో చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి. ఆయన తనకు చెప్పలేని అనుభవాలు ఉన్నాయి, వైసీపీకి కోటరీ పాలన నాశనం చేసింది వంటి వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశమయ్యాయి.

‍వైసీపీలో కోటరీ పాలన

వైసీపీ అధినేత జగన్ చుట్టూ కొందరు నేతలు, సలహాదారులు, అధికారుల కోటరీ పనిచేస్తోందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. “పార్టీలో నెంబర్ 2గా ఉన్న నన్ను 2000వ స్థాయికి పడేశారు” అని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర గౌరవహానికరంగా ఉన్నాయి. ఇటువంటి రాజకీయ పరాభవమే తనను పార్టీకి దూరం చేస్తుందని చెప్పారు. నిజానికి విజయసాయిరెడ్డి ఒకప్పుడు జగన్‌కు అత్యంత నమ్మకమైన నేతగా గుర్తింపు పొందారు. ఆయన పార్టీ వ్యవహారాలలో, ముఖ్యంగా పార్లమెంటరీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారు. అలాంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం పార్టీపై తీవ్ర విమర్శగా మారింది.

మద్యం కుంభకోణంపై ఫైర్ అయిన విజయసాయి

తాజాగా జరిగిన మరో పరిణామం — విజయసాయి రెడ్డి మద్యం కుంభకోణం కేసులో సాక్షిగా విచారణకు హాజరై, సిట్ అడిగితే మరిన్ని వివరాలు చెబుతా అని వ్యాఖ్యానించడం — వైసీపీ నేతలను షాక్‌కి గురిచేసింది. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు, ముఖ్యంగా లిక్కర్ స్కాం లో వైసీపీ పాలనలో జరిగిన దుష్ప్రభావాలను సూచించడంతో పార్టీ పరువు దెబ్బతిన్నదనే చెప్పాలి.

వైవీ సుబ్బారెడ్డి కౌంటర్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి దీనిపై తీవ్రంగా స్పందించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, పార్టీలో కోటరీ అనేది లేదు. జగన్‌కి ఎవరూ మించి లేరు. పార్టీ వ్యవహారాలు అన్ని ఆయన ఆధ్వర్యంలోనే ఉంటాయి. మాజీ ఎంపీకి ఇది తెలియదా? అంటూ విమర్శించారు. ఇప్పుడు పార్టీని వదిలేసి బయటకు వెళ్లిన తరువాత మాట్లాడడం సరిగ్గా లేదు. అధికారంలో ఉన్నప్పుడు కోటరీ ఎందుకు కనిపించలేదు? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కోటరీ కోటరీ అంటూ మాజీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి వ్యాఖ్యానించడంపై ఆయన తీవ్ర స్తాయిలో మండిపడ్డారు. పార్టీలో కేవలం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను ఆశయాలను ప్రతి ఒక్కరు అమలు చేస్తారన్నారు. పార్టీలో కోటరీ అనే పదానికి చోటు లేదన్నారు.

‍విజయసాయిరెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయాక అభాండాలు వేస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. కోటరీ ఉందా లేదా అనేది అధికారంలో ఉన్నప్పుడు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. కోటరీని ఎవరు నడిపారో విజయసాయికి తెలియదా అని నిలదీశారు. తమ పార్టీలో ఒకటి నుంచి వంద వరకు జగనే అన్నారు. లిక్కర్ సహా అనేక అంశాలపై కేసులు పెడుతున్నారని, తమ హయాంలో ఎలాంటి లిక్కర్ స్కామ్ జరగలేదని వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ వ్యవహారంపై కోర్టులోనే తేల్చుకుంటామన్నారు.

Read also: Hari Venkata Kumari: మేయర్ పదవిని కోల్పోయిన వైసీపీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870