हिन्दी | Epaper

పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు

Sudheer
పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఒంగోలు మరియు తిరుపతి నగరపాలక సంస్థలకు చెందిన వైసీపీ కార్పొరేటర్లు భారీగా జనసేనలో చేరారు. ఒంగోలు నగరానికి చెందిన 20 మంది వైసీపీ కార్పొరేటర్లు బాలినేని శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. జనసేన కండువాలు కప్పి వారికి పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు. ఈ పరిణామంతో ఒంగోలు నగర పాలక సంస్థలో వైసీపీ బలం తీవ్రంగా తగ్గిపోయింది.

janasena tg

ఒంగోలు కార్పొరేషన్‌లో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ

ఇప్పటివరకు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్‌లో వైసీపీకి 43 మంది కార్పొరేటర్ల మద్దతు ఉండగా, ఇప్పుడు అది కేవలం నలుగురికి పరిమితమైంది. ఇంతకుముందే మేయర్, డిప్యూటీ మేయర్ సహా 19 మంది జనసేనలో చేరారు. ఇప్పుడు మరో 20 మంది చేరడంతో ఒంగోలు కార్పొరేషన్‌పై జనసేన ప్రభావం పెరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు బాలినేని ప్రణీత్ కూడా జనసేనలో చేరటం రాజకీయంగా కీలక పరిణామంగా మారింది. ఇది వైసీపీకి గట్టి దెబ్బగా విశ్లేషకులు చెబుతున్నారు.

తిరుపతిలోనూ జనసేనకు బలం

ఒంగోలు మాత్రమే కాదు, తిరుపతిలోనూ వైసీపీ కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో జనసేనలో చేరారు. జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో తిరుపతి కార్పొరేటర్లు పవన్ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి జనసేన కండువాలు కప్పి పవన్ స్వాగతం పలికారు. వీరి చేరికతో జనసేన పటిష్టంగా ఎదుగుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఇది వైసీపీకి మిగిలిన రోజుల్లో మరిన్ని అవాంతరాలను తెచ్చే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

📢 For Advertisement Booking: 98481 12870