हिन्दी | Epaper

YS Jagan: ఏపీలో లక్ష ఉద్యోగాలను వైసీపీ అడ్డుకుంటోంది: నారా లోకేశ్

Rajitha
YS Jagan: ఏపీలో లక్ష ఉద్యోగాలను వైసీపీ అడ్డుకుంటోంది: నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు రాకుండా వైసీపీ కుట్ర చేస్తోందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara lokesh) తీవ్ర ఆరోపణలు చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, రాష్ట్రంలో లక్షకు పైగా ఉద్యోగాలను సృష్టించే ప్రాజెక్టులను అడ్డుకునేలా పిల్స్ వేయిస్తున్నారని విమర్శించారు. ఇది నేరుగా యువత భవిష్యత్తును దెబ్బతీసే చర్యగా ఆయన అభివర్ణించారు.

Read also: AP: వారికీ ఉచితంగా నైపుణ్య శిక్షణ

YS Jagan

YS Jagan

వైసీపీ అభివృద్ధికి అడ్డు పడుతోందని

టీసీఎస్, కాగ్నిజెంట్, సత్వ, రహేజా ఐటీ పార్కుల వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల ప్రాజెక్టులు కార్యరూపం దాల్చితే ఏపీలో లక్షకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని లోకేశ్ తెలిపారు. అయితే ఈ కీలక ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకుని కోర్టుల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయడం ద్వారా వైసీపీ అభివృద్ధికి అడ్డు పడుతోందని ఆరోపించారు. ప్రతి అడుగులోనూ రాష్ట్రాన్ని వెనక్కి లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.

యువత భవిష్యత్తుపై మీకెందుకంత ద్వేషం

ఈ సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను ఉద్దేశించి నారా లోకేశ్ సూటి ప్రశ్న వేశారు. యువత భవిష్యత్తుపై మీకెందుకంత ద్వేషం అని ప్రశ్నించిన ఆయన, రాష్ట్ర అభివృద్ధి, ఉపాధి అవకాశాలను అడ్డుకోవడం ద్వారా రాజకీయ లాభం పొందాలనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ పురోగతిని అడ్డుకునే ఈ విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

📢 For Advertisement Booking: 98481 12870