हिन्दी | Epaper

YS Jagan: పవన్ కుమారుడి ప్రమాదంపై స్పందించిన జగన్

Sharanya
YS Jagan: పవన్ కుమారుడి ప్రమాదంపై స్పందించిన జగన్

పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ గాయపడిన విషయం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. సింగపూర్‌లోని ఓ పాఠశాలలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో ఆయన గాయపడినట్టు సమాచారం. ఈ ఘటనపై అభిమానులు, నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

జగన్ స్పందన

ఈ విషాద ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పందన ప్రత్యేక ఆకర్షణగా మారింది. రాజకీయ విభేదాలు పక్కనపెట్టి, మానవీయ కోణంలో స్పందించిన ఆయన మాటలు హృదయాలను తాకాయి. ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) వేదికగా స్పందించిన జగన్, మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి తెలిసి నేను షాక్ అయ్యాను. అందులో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడని తెలిసింది. ఈ క్లిష్ట సమయంలో నా ఆలోచనలు ఆ కుటుంబంతోనే ఉంటాయి. మార్క్ శంకర్ త్వరగా, పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను – అని జగన్ పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు వైఎస్ అభిమానులే కాదు, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా హర్షాతిరేకంగా స్పందిస్తున్నారు. రాజకీయ శత్రువుల మధ్య మానవీయత ఉన్నదని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది. ఇక ఇప్ప‌టికే ఈ ఘ‌ట‌న‌పై ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేశ్‌, మాజీ మంత్రి కేటీఆర్, చిరంజీవి త‌దిత‌రులు స్పందించారు. ప‌వ‌న్ కుమారుడు గాయ‌ప‌డ‌డం ప‌ట్ల దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. సింగపూర్‌లోని ఆసుపత్రిలో మార్క్ శంకర్‌కు చికిత్స కొనసాగుతున్నట్టు సమాచారం. గాయాలు పెద్దగా ప్రమాదకరంగా లేవని, మానసికంగా మాత్రం చిన్నారి ఉలిక్కిపడినట్టు మెడికల్ బులిటన్ తెలిపింది. పవన్ కళ్యాణ్ కుటుంబం ప్రస్తుతం సింగపూర్‌లోనే ఉన్నట్టు తెలిసింది.

Read also: Kia Motors: కియా కంపెనీలో భారీగా కారు ఇంజన్లు మాయం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

📢 For Advertisement Booking: 98481 12870