ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ (Jagan) చేసిన ఆరోపణలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తీవ్రంగా స్పందించారు. “జగన్ గారూ… మీ ఏడుపులే మాకు దీవెనలు!” అంటూ ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో విద్యా రంగంలో జరుగుతున్న మెరుగుదల చూసి జగన్ ఓర్వలేక అర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.మీ ఐదేళ్ల పాలనలో విద్యావ్యవస్థను ఎటు మలుపు తిప్పారో అందరికీ తెలుసు, అని లోకేశ్ పేర్కొన్నారు. తాను మంత్రి అయిన తరువాత ఒక్క ఏడాదిలో అనేక సంస్కరణలు చేపట్టి ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తున్నానని, అదే చూసి జగన్ అసహనం వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు.
ఈసెట్ అడ్మిషన్లపై స్పష్టత
ఈసెట్ కౌన్సిలింగ్ విషయంలో జగన్ చేసిన విమర్శలకూ లోకేశ్ సమాధానమిచ్చారు. “మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కౌన్సిలింగ్ నిర్వహించారో కూడా గుర్తు లేదు. కోవిడ్ అనంతరం 2022లో సెప్టెంబర్లో, 2023లో జూలై చివర్లో మాత్రమే కౌన్సిలింగ్ పూర్తి చేశారు,” అని వివరించారు. అయితే తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే 2024లో కౌన్సిలింగ్ జూలై మూడో వారంలో పూర్తవుతుందని తెలిపారు.
అబద్ధాలపై మేం చతురంగా ఎదురిస్తాం
లోకేశ్ మాట్లాడుతూ, “జగన్ గారి మాటలకు నిజం కనిపించడం లేదు. అసలు ఓ వైపు రాష్ట్రాన్ని చితికదిడ్చినవారు, మరోవైపు మాకు బోధలు చెబుతున్నారు. ఇది ప్రజలకు హాస్యాస్పదంగా మారింది,” అని ఎద్దేవా చేశారు. తాము చేస్తున్న సుదీర్ఘ సంస్కరణలను ప్రజలు గుర్తిస్తున్నారని, జగన్ చేసే విమర్శలు రాజకీయ ప్రయోజనాల కోసమేనని తెలిపారు.
ప్రజల నమ్మకమే మా బలం
“మేము విద్యను ఒక మిషన్గా తీసుకున్నాం. నాణ్యతపై స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్న శ్రమను తక్కువ అంచనావేయడం అన్యాయం,” అని లోకేశ్ తెలిపారు. ఈ విమర్శలు తమను మేల్కొలిపే అవకాశం అవుతాయని, ప్రజలతో జతగా ప్రయాణిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Read Also : YS Jagan : ఏపీఈసెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ: జగన్