हिन्दी | Epaper

News Telugu: YCP: ఆ 5గురు ఎమ్మెల్సీలు విచారణకు హాజరు..

Rajitha
News Telugu: YCP: ఆ 5గురు ఎమ్మెల్సీలు విచారణకు హాజరు..

సచివాలయం : రాజీనామాలు ఆమోదించాలని కౌన్సిల్ చైర్మన్ కు వినతి శాసన మండల సభ్యులుగా వైకాపాకు రాజీనామా చేసిన ఐదుగురు ఎమ్మెల్సీలు మా రాజీనామాలు ఆమోదించాల్సిందిగా శాసనమండలి చైర్మన్ మోషన్ రాజుకు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. గతంలోనే రాజీనామా చెసినప్పటికీ ఆమోదించకపోవడంతో ఎమ్మెల్సీ జయ మంగళం వెంకటరమణ కోర్టు ను ఆశ్రయించారు. ఈ విషయంపై న్యాయస్థానం ఎమ్మెల్సీల రాజీనామాలపై విచారణ చేయాల్సిందిగా న్యాయస్థానం ఉత్తరువుల్లో సూచించింది. ఈ కారణంగా కర్రి పద్మశ్రీ పోతుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి మర్రి రాజశేఖర్, జయ మంగళ వెంకటరమణ ఐదుగురు ఎమ్మెల్సీలను శాసనమండలి వద్ద రాజీనామాలు గల కారణాలను చైర్మన్ అడిగి తెలుసుకున్నారు. పార్టీలు మారినందున వైకాపా (YSR) ఎమ్మెల్సీలుగా కొనసాగలేమని చైర్మన్ కు వివరించారు.

Read also: Parlement: పార్లమెంటు లో మోదీ వ్యాఖ్యలకు ప్రియాంకా గాంధీ కౌంటర్

Those 5 MLCs appear for questioning

Those 5 MLCs appear for questioning

వైకాపాలో గౌరవం లేనందునే

సభ్యుల నుంచి కారణాలు తెలుసుకోకుండా రాజీనామాలు ఆమోదించకపోవడం జరిగిందని తెలిపారు. అందువలన వారి వ్యక్తిగత అభిప్రాయాలను తెలుసుకునేందుకు పిలిపించి విచారించామని దీనిపై పరిశీలించి త్వరలో రాజీనామా విషయాలపై స్పందిస్తానని మండల చైర్మన్ వివరించారు. పోతుల సునీత విచారణకు హాజరు కాలేదు. శాసనమండలిలో వైకాపా ఎమ్మెల్సీ గా కొనసాగలేమని రాజీనామాలు దయతో ఆమోదించాలని మర్రి రాజశేఖర్ చైర్మన్ కోరినట్లు విలేకరులకు తెలిపారు. సోమవారం చైర్మన్ విచారణ అనంతరం శాసనమండలి బయట లేఖలతో మాట్లాడుతూ గతంలోనే టిడిపిలో చేరినందున ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. వైకాపాలో గౌరవం లేనందునే అవమానాలు భరించలేక టిడిపిలో చేరినట్లు వివరించారు. ఆ పార్టీలో వ్యక్తిగతంగా ఒక కులాన్ని టార్గెట్ చేసి అవమానిస్తున్నారని వివరించారు.

గౌరవం లేని పార్టీలో

పార్టీకి 10సంవత్సరాలు సేవ చేసినప్పటికీ మంత్రి పదవి ఇస్తామని చివరి సంవత్సరం ఎమ్మెల్సీగా ఇచ్చి అవమానించారని తెలిపారు. అందువలన గౌరవం లేని పార్టీలో ఇమడలేక టిడిపిలో గౌరవంతో కొనసాగాలని పార్టీ మారినట్లు అభిప్రాయాన్ని తెలిపారు. అధికార పార్టీలో చేరి ప్రతిపక్ష ఎమ్మెల్సీగా కొనసాగనున్న ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఎన్నికల అనంతరం టిడిపికి ప్రజల పట్టకం కట్టడంతో ఎమ్మెల్సీగా ఉన్న నేను ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ అధికారపక్షంలో చేరినట్లు వైకాపా ఎమ్మెల్సీ తెలిపారు. సోమవారం శాసనమండలి చైర్మన్ వద్ద విచారణకు హాజరైన అనంతరం బయట విలేకరులతో మాట్లాడారు. నా వ్యాపారాలు రాజకీయ భవిష్యత్తు స్థానిక ప్రజల ఇబ్బందులు అవసరాలను తీర్చేందుకే పార్టీ మారినట్లు తెలిపారు. అందువలన నా రాజీనామా ఆమోదించాల్సిందిగా చైర్మన్ కు వివరించినట్లు తెలిపారు.ప్రజల్లో విశ్వాసంలేని పార్టీలో కొనసాగలేనందున వైకాపాకురాజీనామా చేసినట్లు వివరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ సులభం

ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ సులభం

నిరుద్యోగులకు శుభవార్త.. ఉగాది రోజున ఏపీ జాబ్ క్యాలెండర్!

నిరుద్యోగులకు శుభవార్త.. ఉగాది రోజున ఏపీ జాబ్ క్యాలెండర్!

మహిళల జోలికొస్తే ఖబడ్డార్.. నేరగాళ్లపై డ్రోన్ నిఘా!

మహిళల జోలికొస్తే ఖబడ్డార్.. నేరగాళ్లపై డ్రోన్ నిఘా!

ఆరు నెలల్లో స్థానిక ఎన్నికలు: మంత్రులకు సీఎం చంద్రబాబు క్లారిటీ!

ఆరు నెలల్లో స్థానిక ఎన్నికలు: మంత్రులకు సీఎం చంద్రబాబు క్లారిటీ!

పెద్ద దిక్కును కోల్పోయిన జర్జంగి

పెద్ద దిక్కును కోల్పోయిన జర్జంగి

బీసీ రక్షణ చట్టంపై నేడు కీలక సమావేశం

బీసీ రక్షణ చట్టంపై నేడు కీలక సమావేశం

📢 For Advertisement Booking: 98481 12870