हिन्दी | Epaper

Pitapuram : ప్ర‌తి హామీని నెర‌వేరుస్తాం – ప‌వ‌న్ కల్యాణ్

Sudheer
Pitapuram : ప్ర‌తి హామీని నెర‌వేరుస్తాం – ప‌వ‌న్ కల్యాణ్

పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ రోజు ఆయన పిఠాపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల స్థాయికి విస్తరించేందుకు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇప్పటివరకు 30 పడకలతో సేవలందిస్తున్న ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు ఇది సహకరిస్తుందని పవన్ తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమానికి టీడీపీ ఇన్‌చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా హాజరయ్యారు.

పిఠాపురంలో అభివృద్ధి పనులు మరింత వేగం

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో, ముఖ్యంగా పిఠాపురంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతాయన్నారు. ఆసుపత్రి స్థాయిని పెంచడం అభివృద్ధికి సంకేతమని, దీని ద్వారా ప్రజల ఆరోగ్యానికి గణనీయంగా మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని అన్నారు.

టిటిడి కళ్యాణ మండపానికి, చేబ్రోలు శ్రీ సీతారామ స్వామి ఆలయ రథశాల, మండప నిర్మాణానికి శంకుస్థాపనలు

ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ యూ.కొత్తపల్లిలో టిటిడి కళ్యాణ మండపానికి, చేబ్రోలు శ్రీ సీతారామ స్వామి ఆలయ రథశాల, మండప నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. మహిళల కోసం కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి, వారికి కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. అలాగే రైతులకు అవసరమైన వ్యవసాయ యంత్రాలను కూడా అందజేశారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

📢 For Advertisement Booking: 98481 12870