విశాఖపట్నం(Vizag) ప్రాంత అభివృద్ధి, పూర్వోదయ పథకాల అమలుపై నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం(B. V. R. Subrahmanyam) సచివాలయంలో ఏపీ సీఎస్ విజయానంద్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర తీరప్రాంత అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, పోర్ట్ కనెక్టివిటీ వంటి అంశాలు చర్చకు వచ్చాయి. సుభ్రహ్మణ్యం మాట్లాడుతూ, “ఏపీలో అనేక ఓడరేవులు ఉన్నా, ఒక కంటైనర్ మెగా పోర్ట్ అవసరం ఉంది. ఇది అంతర్జాతీయ వాణిజ్యానికి బలాన్ని ఇస్తుంది” అని సూచించారు.
Read also: RBI: బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ శుభవార్త!

పూర్వోదయ పథకం ద్వారా తీరప్రాంత జిల్లాల్లో పారిశ్రామిక వృద్ధి వేగవంతం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పథకం కింద మౌలిక వసతులు, రోడ్లు, రైలు కనెక్టివిటీ, లాజిస్టిక్స్ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు.
సచివాలయ సమీక్షలో కీలక సూచనలు
ఏపీ సీఎస్ విజయానంద్ మాట్లాడుతూ, విశాఖ(Vizag) గ్రోత్ హబ్ పనులు వేగంగా సాగుతున్నాయని, వీటిని మరింత చురుకుగా చేయడానికి ప్రత్యేక ఇన్ఛార్జిని నియమించనున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారం మరింత పెంచాలని, ముఖ్యంగా పూర్వోదయ స్కీమ్ కింద తగిన నిధుల విడుదల జరిగేలా చూడాలని నీతి ఆయోగ్ సీఈఓను కోరారు. అదనంగా, తీరప్రాంత పరిశ్రమలు, రవాణా మార్గాలు, గ్రీన్ పోర్ట్ ప్రాజెక్టులు వంటి అంశాలు చర్చించబడ్డాయి. విశాఖను భవిష్యత్తులో దక్షిణ భారతదేశ ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
విశాఖకు బలమైన అభివృద్ధి దిశ
విశాఖ గ్రోత్ హబ్ ప్రాజెక్టు రాష్ట్రానికి కొత్త అవకాశాలు తెస్తుందని నిపుణులు భావిస్తున్నారు. పూర్వోదయ పథకం మద్దతుతో తీరప్రాంత అభివృద్ధి వేగవంతమైతే, ఆర్థికంగా ఏపీకి పెద్ద మేలు కలుగుతుంది. మెగా పోర్ట్ స్థాపన, మౌలిక సదుపాయాల విస్తరణ, పరిశ్రమలకు ప్రోత్సాహం వంటి చర్యలు ఆర్థిక వృద్ధికి దోహదం చేయనున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: