Vijayawada: తిరుగు ప్రయాణం కష్టాలు.. బస్సులు, రైళ్లలో కిక్కిరిసిన జనాలు

Read Time:  1 min
Difficulties during the return journey
Difficulties during the return journey
FONT SIZE
GET APP

పండుగ సెలవులు ముగియడంతో విద్యాసంస్థలు, కార్యాలయాలు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో స్వగ్రామాలకు వెళ్లిన ప్రజలు తిరిగి పట్టణాలు, ఉద్యోగ ప్రాంతాల వైపు ప్రయాణం ప్రారంభించారు. ఈ క్రమంలో రహదారులు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో ప్రయాణికుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యంగా విజయవాడ (vijayawada) కేంద్రంగా రవాణా వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి కనిపిస్తోంది.

Read also: Srikakulam: అరసవల్లిలో రథసప్తమికి ముమ్మర ఏర్పాట్లు

Difficulties during the return journey

Difficulties during the return journey

బస్సులు, రైళ్లలో ఇబ్బందులు

రైళ్లలో జనరల్, స్లీపర్ బోగీలు పూర్తిగా కిక్కిరిసిపోయాయి. చాలా చోట్ల సీట్లు దొరకక ప్రయాణికులు నిల్చునే ప్రయాణం చేయాల్సి వస్తోంది. స్పెషల్ బస్సుల సంఖ్య సరిపోకపోవడంతో సాధారణ బస్సుల్లోనే అధిక సంఖ్యలో ప్రయాణికులు ఎక్కుతున్నారు. టోల్ గేట్ల వద్ద కూడా కిలోమీటర్ల మేర వాహనాల క్యూలు ఏర్పడటం ప్రయాణ సమయాన్ని మరింత పెంచుతోంది.

వినుకొండలో బస్సు ఎక్కే సమయంలో తొక్కిసలాట

ఈ తిరుగుపయన రద్దీ నేపథ్యంలో పల్నాడు జిల్లా వినుకొండలో బస్సు ఎక్కే సమయంలో తొక్కిసలాట జరిగింది. ఒక్కసారిగా ఎక్కువ మంది బస్సు ఎక్కేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పినా, ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అదనపు బస్సులు, సరైన నియంత్రణ అవసరమని ప్రయాణికులు కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.