हिन्दी | Epaper

Venkateswara Rao: జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన మాజీ ఐపీఎస్ ఏబీవీ

Sharanya
Venkateswara Rao: జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన మాజీ ఐపీఎస్ ఏబీవీ

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర పోలీసు వ్యవస్థ కోల్పోయిందని, రాజకీయ లబ్ధి కోసం వ్యవస్థను దారుణంగా దుర్వినియోగం చేశారని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (Venkateswara Rao) ఆరోపించారు. గుంటూరులో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన “పోలీసు వ్యవస్థలో సంస్కరణలు” అనే చర్చా వేదికలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, పోలీసు వ్యవస్థలో ప్రస్తుత పరిస్థితులను బట్టే ప్రజాస్వామ్య స్థితిగతులు అర్థమవుతాయని అన్నారు.

జగన్‌పై నేర కేసులు – కానీ కోర్టుకు ఎందుకు రావడం లేదు?

ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యల ప్రకారం, జగన్‌పై అనేక కేసులు ఉన్నా చట్టంలో ఉన్న లొసుగులను అడ్డుపెట్టుకుని ఏడేళ్లుగా న్యాయస్థానానికి వెళ్లడం లేదన్నారు. పోలీసు శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలు, ప్రజా సంఘాలు చైతన్యంతో ఉద్యమించి పార్టీలు తమ మేనిఫెస్టోలో పోలీసు సంస్కరణలకు ప్రాధాన్యం ఇచ్చేలా ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించడం – నియంతృత్వానికి నిదర్శనం

గన్ తన హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీసు అధికారులతో తప్పుడు కేసులు నమోదు చేయించాడని, ప్రభుత్వ యంత్రాంగాన్ని భయపెట్టి తనకు వ్యతిరేకంగా ఉండే నేతల, సామాజిక కార్యకర్తలపై అక్రమ చర్యలు చేపట్టాడని అన్నారు.

జగన్ పాలనపై సమగ్ర విచారణ

జగన్ మోహన్ రెడ్డి హయాంలో జరిగిన దుర్మార్గాలన్నింటిపైనా విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తెనాలిలో ముగ్గురు యువకులను పోలీసులు కొట్టడం చట్టవిరుద్ధమని, ప్రజాస్వామ్య పాలనలో ఇలాంటి చర్యలను అందరూ ఖండించాల్సిందేనన్నారు.

పోలీసు సంస్కరణలు – సమయం ఆసన్నమైంది

సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, చైతన్య వేదిక అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, ప్రొఫెసర్ డీఏఆర్ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

Read also: Kavati Manohar: మాజీ మేయర్ మనోహర్ ను సస్పెండ్ చేసిన జగన్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

📢 For Advertisement Booking: 98481 12870