Tirumala lost gold chain : తిరుమలలో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తత మరోసారి ప్రశంసలు అందుకుంది. శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలు పోగొట్టుకున్న సుమారు రూ.6 లక్షల విలువైన బంగారు గొలుసును గంటల వ్యవధిలోనే గుర్తించి భద్రంగా తిరిగి అందజేశారు. ఈ ఘటన ఆదివారం తిరుమలలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. డి. కోటేశ్వరరావు తన కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ముందుకు కదులుతున్న సమయంలో ఆయన భార్య మెడలోని బంగారు గొలుసు జారి కింద పడిపోయింది. అయితే ఈ విషయం వారికి అప్పట్లో తెలియలేదు. దర్శనం అనంతరం గొలుసు పోయినట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే టీటీడీ విజిలెన్స్ అధికారులను సంప్రదించారు.
Read Also: Bengaluru: ప్రియురాలి నిశ్చితార్థం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న బాడీబిల్డర్

ఫిర్యాదు అందిన వెంటనే సీవీఎస్ఓ మురళీకృష్ణ ఆదేశాల మేరకు విజిలెన్స్ బృందం రంగంలోకి దిగింది. క్యూ కాంప్లెక్స్లోని సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించి గొలుసు పడిపోయిన ప్రదేశాన్ని గుర్తించారు. అనంతరం ఆభరణాన్ని భద్రంగా స్వాధీనం చేసుకుని బాధిత భక్తుడికి అప్పగించారు. వేగంగా స్పందించి భక్తుడికి సహాయం చేసిన విజిలెన్స్ సిబ్బందిని టీటీడీ ఉన్నతాధికారులు అభినందించారు. గొలుసు తిరిగి దొరకడంతో భక్తుల కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: