हिन्दी | Epaper

News Telugu: TTD: మీ వద్ద ఆధారాలు ఉంటే ఇవ్వండి: డిఎస్పీ

Rajitha
News Telugu: TTD: మీ వద్ద ఆధారాలు ఉంటే ఇవ్వండి: డిఎస్పీ

TTD: గోవుల మృతిపై – టిటిడి (TTD) మాజీ ఛైర్మన్ భూమనను ప్రశ్నించిన డిఎస్పీ తిరుమల : ఎంతో పవిత్రమైన గోమాతలు టిటిడి గోశాలలో మృతిచెందాయనే ఆరోపణలపై మీవద్ద ఆధారాలు ఉంటే ఇవ్వాలని టిటిడి మాజీఛైర్మన్, వైసిపి ఉమ్మడిజిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డిని తిరుపతి డిఎస్పీ భక్తవత్సలం ప్రశ్నించారు. ఏప్రిల్లో మీడియాతో గోవులు అధికంగా మృతి చెందాయని ఫోటోలతో మీడియాతో మాట్లాడిన అంశంపై టిటిడి బోర్డు సభ్యుడు ప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కేసులో భూమన కరుణాకర్రెడ్డిని (Bhumana karunakar reddy) గురువారం ఉదయం తిరుపతి ఎస్వీయూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు రావాలని నోటీసులిచ్చారు. ఉదయం 11గంటలకు పార్టీ శ్రేణులతో కలసి ప్రదర్శనగా భూమన స్టేషన్కు వచ్చారు. పార్టీ న్యాయవాదితో కలసి వచ్చిన ఆయనను అక్కడ డిఎస్పీ భక్తవత్సలం కొన్ని ప్రశ్నలను కరుణాకర్రెడ్డికి సంధించి సమాధానాలు రాబట్టారనేది తెలుస్తోంది.

Read aslo: AP: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఎపి ముందంజ

TTD: మీ వద్ద ఆధారాలు ఉంటే ఇవ్వండి: డిఎస్పీ

TTD: మీ వద్ద ఆధారాలు ఉంటే ఇవ్వండి: డిఎస్పీ

గోవుల మృతిపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, గోవులు అధికంగా మరణిస్తున్నాయని మాట్లాడానని తెలిపినట్లు సమాచారం. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతో ఆయన్ను పంపివేశారు. అయితే దీనిపై భూమన కరుణాకర్రెడ్డి గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. టిటిడి బోర్డు గోవుల పట్ల నిర్లక్ష్యం తగదని, గోవులు మరణిస్తున్నాయని తెలిపానన్నారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అసభ్య పదజాలంతో కూటమి నేతలు ఆరోపణలు చేస్తున్నారని అసహనం చెందారు. ఇప్పటివరకు తాను చేసిన ఆరోపణలపై ఏ ఒక్క ఆరోపణలు తేల్చింది లేదన్నారు. వాస్తవాలు చెబుతుంటే నిందారోపణలు చేస్తున్నారని, తనపై విషప్రచారం చేస్తున్నారన్నారు. టిటిడిలో పనిచేసే వారికి తనపై నమ్మకం, గౌరవం వుందని, టిటిడి ఉద్యోగులతో ఒకరకమైన బాండింగ్ ఉందన్నారు.

గోవుల మృతిపై ఎవరిని ప్రశ్నించారు?
టిటిడి మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డిని డిఎస్పీ భక్తవత్సలం ప్రశ్నించారు.

ఈ విచారణ ఎందుకు జరిగింది?
టిటిడి గోశాలలో గోవులు మృతి చెందాయని భూమన చేసిన ఆరోపణలపై విచారణ జరిగింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

📢 For Advertisement Booking: 98481 12870