నారాయణవనం(తిరుపతి జిల్లా) : తిరుపతి జిల్లా పుత్తూరు సమీపం నారాయణవనం మండలం పరిధి సిద్దార్థ ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం (ఇఇఇ) బిటెక్ చదువుతున్న ప్రదీప్ కుమార్ (19) ఓ ప్రవేటు హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మ హత్య చేసుకున్న సంఘటన మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. విద్యార్థి ఆత్మహత్యకు (suiside) సంబందించి వివరాలు ఇలా వున్నాయి. కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన కృష్ణమూర్తి కుమారుడు ప్రదీప్ కుమార్ సిద్దార్థ ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ప్రదీప్ కుమార్ కళాశాలకు సమీపంలోని ఓ ప్రైవేటు హాస్టల్ మొదటి అంతస్తులోని ఓ గదిలోని సహా విద్యార్థులతో కలిసి వుంటూ చదువుకుంటున్నాడు.
Read also: AP: నేడు భీమవరం నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ భేటీ

engineering student committed suicide in his hostel room
విద్యార్థి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్న కోణంలో
అయితే మంగళవారం ఉదయం సుమారు 11గంటల ప్రాంతంలో హాస్టల్ గదిలోనే ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ప్రదీప్ కుమార్ కళాశాలకు రాకపోవడంతో అతని స్నేహితుడు ఫోన్ చేశాడు. ఫోన్ తీయకపోవడంతో మధ్యాహ్నం 3గంటలకు హాస్టల్ గదిలోకి వెళ్లి చూడగా ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొని వుండడంతో హాస్టల్ నిర్వాహకులు మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం స్థానిక ఎస్ఐ శ్రీనివాసులకు సమాచారం అందించడంతో వెంటనే ఎస్ఐ మృతదేహాన్ని పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని తల్లితండ్రులకు సమాచారం అందించి, విద్యార్థి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్న కోణంలో పుత్తూరు రూరల్ సిఐ రవీంద్ర, ఎస్ఐ శ్రీనివాసులు తన సిబ్బందితో కలిసి దర్యాప్తు చేసుకున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు సంబందించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: